ఏపీలోని టీడీపీ సారించింది. నియోజకవర్గాలలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో పాటుగా నెలకొల్పి కల్పించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాలెం వద్ద కేంద్ర ప్రభుత్వం సహకారంతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రూ.3500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో షిప్‌ బిల్డింగ్, మరమ్మతులు వంటి పనులు చేపట్టనున్నారు.మరోవైపు నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు కోసం భూమిని పరిశీలిస్తున్నారు. స్థానిక రెవెన్యూ యంత్రాంగం భూములను పరిశీలిస్తోంది. అయితే నౌకా నిర్మాణ కేంద్రం కోసం 2,700 ఎకరాలు అవసరమని తొలుత భావించారు. అయితే తాజాగా 2,300 ఎకరాలు భూమిని గుర్తించాలని స్థానిక యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. వాకాడు మండలంలోని వాలమేడు, వాగర్రు, పామంజి రెవెన్యూ గ్రామాల పరిధిలో భూమిని అధికారులు ఇప్పటికే గుర్తించారు. తూపిలిపాలెం తీరం వెంట ఉన్న భూములు ఈ నౌకా నిర్మాణ కేంద్రానికి అనువుగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుతో ప్రత్యక్షంగా 5000 మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. అలాగే నౌకా నిర్మాణ కేంద్రంతో పాటుగా అదనంగా మరో 26 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు, భూముల కేటాయింపులతో పాటుగా వేగంగా అనుమతులు మంజూరు చేసే పనిలో ఉంది. అలాగే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ.. అంటే 175 నియోజకవర్గాలలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కొన్నిచోట్ల ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయగా.. మరికొన్ని చోట్ల శంకుస్థాపనలు జరిగాయి.