గడిచిన మూడు నాలుగు రోజులుగా తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌లోని భారతీయ విద్యార్థులపై భద్రతపై ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో వారిని సురక్షితంగా తరలించేందుకు భారత్ చేసిన విజ్ఞ‌ప్తిపై ఇరాన్ సోమవారం స్పందించింది. తమ దేశ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసినప్పటికీ అన్ని భూ సరిహద్దులు తెరిచి ఉన్నాయని, వాటి ద్వారా భారతీయ పౌరులు బయటకు వెళ్లొచ్చని ఇరాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. భారత రాయబార కార్యాలయానికి సురక్షిత తరలింపు కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇరాన్ స్పష్టం చేసింది. వ్యక్తమవుతోన్న తరుణంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.‘ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, విమానాశ్రయాలు మూసివేయడం వల్ల.. అనేక దేశాలు తమ రాయబారులని, పౌరులని తరలించాలనే అభ్యర్థనల నేపథ్యంలో భూసరిహద్దులు పూర్తిగా తెరిచి ఉంచుతున్నాం’ అని వెల్లడించింది. భారత పౌరులు లేదా దౌత్యవేత్తలు ఇరాన్ నుంచి వెళ్లాలంటే వారి పేరు, పాస్‌పోర్ట్ నంబర్, వాహన వివరాలు, ప్రయాణ సమయం, ఎంచుకున్న సరిహద్దు మార్గాన్ని ముందుగా తెలియజేయాలని, తద్వారా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవచ్చని ఇరాన్ జనరల్ ప్రోటోకాల్ విభాగం తెలిపింది. ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను తక్షణమే తరలించాలని చేసిన సంగతి తెలిసిందే.ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులుఇజ్రాయేల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలో 1600 మందికిపైగా భారతీయులు ఇరాన్‌లోని వివిధ నగరాల్లో చిక్కుకుపోయారు. వీరిలో 1,500 మందికి పైగా విద్యార్థులు ఉండగా.. అత్యధికులు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. అటు, ఇరాన్‌లోని కొందరు విద్యార్థులను తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, అలాగే ఇతర మార్గాలను కూడా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.‘ఇరాన్‌లో భారత రాయబార కార్యాలయం భద్రతా పరిస్థితిని నిరంతరం గమనిస్తోంది. విద్యార్థులతో టచ్‌లో ఉంటూ అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది’" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.ఇరాన్‌లో ఉన్న భారతీయులు ఆందోళనకు గురికావద్దని, స్థానిక అధికారుల సూచనలను పాటించాలని రాయబార కార్యాలయం సూచించింది. అలాగే, ఎంబసీ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భారతీయుల సమాచారం సేకరించేందుకు గూగుల్ ఫామ్, టెలిగ్రామ్ లింక్‌లను ఎంబసీ షేర్ చేసింది. ఇది కేవలం ప్రస్తుతం ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం మాత్రమే అని స్పష్టం చేసింది.ఇజ్రాయేల్ - ఇరాన్ యుద్ధంజూన్ 13 ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయేల్ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకుని తీవ్ర దాడులు జరిపింది. అలాగే, ఇరాన్‌కు చెందిన న్యూక్లియర్ సైట్లను కూడా ధ్వంసం చేసింది. దీనికి ప్రతీకారంగా, ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి దాడులు చేసింది. దీంతో రెండు దేశాలూ వందలకొద్దీ మిస్సైళ్లు, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. యుద్ధంలో ఇది ఆరంభం మాత్రమేనని, ఇరాన్‌కు నరకపు ద్వారాలు తెరుచుకున్నాయని ఇజ్రాయేల్ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో, ఇరాన్‌లోని భారతీయుల భద్రతకు భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం, విదేశాంగ శాఖలు సమన్వయంగా చర్యలు చేపడుతున్నాయి.