Hyderabad Realty: దేశంలోని ప్రధాన నగరాలకు పోటీ ఇస్తూ స్థిరాస్తి మార్కెట్లో దూసుకెళ్తోంది హైదరాబాద్ మహానగరం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలకు ధీటుగా ఇక్కడ లావాదేవీలు జరుగుతున్నాయి. అయితే, కొద్ది రోజులుగా హైదరాబాద్ మార్కెట్ నెమ్మదించిందని, రియాల్టీ క్రయ విక్రయాలు అంతంత మాత్రంగానే సాగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అందుకు ధరల పెరుగుదలతో పాటు చాలా కారణాలు ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే, ఈ వార్తలను ఖండించింది ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ ఏఎస్‌బీఎల్ (). నెమ్మదించలేదని పేర్కొంది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏఎస్‌బీఎల్ బ్రాడ్‌వే పేరిట 5 ఎకరాల్లో ప్రీమియం రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణం చేపడుతోంది. అయితే, ఈ గేడెట్ కమ్యూనిటీ పనులు ప్రారంభించిన రోజుకే రూ.1000 కోట్లు విలువైన ఫ్లాట్లకు బుకింగులు వచ్చినట్లు ఏఎస్‌బీఎల్ వ్యవస్థాపకులు, సీఈఓ అజితేష్ కొరుపోలు పేర్కొన్నారు. రంగం బలంగానే ఉందని చెప్పేందుకు ఇదే నిదర్శనం అన్నారు. మార్కెట్ నెమ్మదించిందన్న వార్తలను తోసిపుచ్చారు. . ప్రతి ఫ్లాట్‌కు మూడు వేపులా గాజు రెయిలింగ్ గల విశాలమైన బాల్కనీలు ఉంటాయని తెలిపారు. 2029 డిసెంబర్ నాటికి ఫ్లాట్లను కొనుగోలుదారులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. గదుల బయటి వైపు ఫ్లోరింగ్ నుంచి సీలింగ్ వరకు ఎత్తుగా ఉండే విండోలు ఉంటాయన్నారు. అధునాతన సదుపాయాలతో ఈ జీ ప్లస్ 50 అంతస్తుల టవర్లతో కమ్యూనిటీని తీర్చిదిద్దుతున్నామని సేల్స్ విభాగం హెడ్ ఆశిష్, గ్రోత్ విభాగం హెడ్ అనంత్ తెలిపారు. మరోవైపు.. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు హైదరాబాద్ వాసులు ఔటర్ రింగ్ రోడ్ దాటి వెళ్తున్నారు. బడ్జెట్ ధరలో భూములు, ఇళ్లు లభిస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక పెట్టుబడి పెట్టాలనుకునే వారు సైతం ఆయా ఇళ్లు, భూముల వైపే చూస్తున్నారు. అయితే, రూ. 1 కోటి ఆపైన ఇళ్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. డెవలపర్లు సైతం ఈ విభాగంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దీంతో బడ్జెట్ ధరలో ఇళ్ల ప్రాజెక్టులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో చాలా మంది శివారు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.