ఇంగ్లండ్-ఇండియా సిరీస్‌కు సచిన్ పేరు తొలగింపు.. పాత పేరుతోనే ట్రోఫీ!

Wait 5 sec.

అయితే సిరీస్ ప్రారంభానికి ముందే ఆ పేరును తొలగించి మళ్లీ పాత పేరునే కొనసాగిస్తున్నారు. టీమిండియా, ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్స్ , జేమ్స్ అండర్సన్ పేర్లు ఇంత త్వరగా తొలగించడానికి మెయిన్ రీజన్ మాస్టర్ బ్లాస్టరే. సచిన్ నేరుగా రిక్వెస్ట్ చేయడంతోనే ఈ సిరీస్‌కు టెండూల్కర్-అండర్సన్ పేర్లను తొలగించారు. గతంలో ఈ సిరీస్‌కు పటౌడీ ట్రోఫీగా పేరుండేది. గతేడాది అండర్సన్ రిటైర్డ్ అవ్వడం, సచిన్ పేరు ఎలాంటి ట్రోఫీలు లేకపోవడంతో బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కలిసి మాట్లాడుకుని మరీ వీరిద్దరి పేరు మీద నిర్వహించాలని నిర్ణయించారు. పేరు మార్చడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు ఈ ట్రోఫీని పాత పేరుతోనే కొనసాగించాలంటూ చెప్పారు. దాంతో ఈ విషయమై సచిన్ టెండూల్కరే నేరుగా స్పందించి పేరు మార్పు విషయంలో పునరాలోచించాలి అంటూ ఈసీబీకి సూచించారు. అదే సమయంలో బీసీసీఐ పెద్దలను కూడా సచిన్ ఒప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ రిక్వెస్ట్ మేరకు బీసీసీఐ, ఈసీబీ రెండూ కూడా టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ పేరును తొలగించి పటౌడీ ట్రోఫీగా కొనసాగించాలని నిర్ణయించాయి. ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఈసీబీ అధికారి కూడా ఇంగ్లండ్, భారత్ టెస్టు సిరీస్‌ను పటౌడీ ట్రోఫీగా కొనసాగించాలన్న ప్రణాళిక ఉందని ఇటీవలే తెలిపారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడనున్న తొలి సిరీస్ ఇదే. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్ కూడా ఇంగ్లండ్ - ఇండియా సిరీస్‌తోనే ప్రారంభం కానుంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. సీనియర్ల రిటైర్మెంట్‌లో బీసీసీఐ కూడా జట్టులో యువరక్తాన్ని నింపింది. ముఖ్యంగా కరుణ్ నాయర్, సాయి సుదర్శన్‌కు అవకాశం ఇచ్చింది. ఈ సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని యువ కెప్టెన్ శుభమన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఆశపడుతోంది.