అన్నదాత సుఖీభవ పథకం, ఈకేవైసీ అవసరం లేదు.. కానీ 1.45 లక్షలమందికి తప్పదు.. మీ పేరు చెక్ చేస్కోండి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో సాయం పొందడానికి రైతులంతా ఈకేవైసీ (వేలిముద్ర) పూర్తి చేయాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు చెప్పడంతో రైతులు సేవా కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. అయితే ప్రభుత్వం రైతులకు తీపికబురు చెప్పింది.. ఈ కేవైసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సాయం కోసం రైతులు ఈకేవైసీ చేయించుకోవడానికి రైతులు సేవా కేంద్రాల దగ్గర నాలుగు రోజులుగా రద్దీగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం రైతులకి ఊరటనిచ్చేలా అందరు రైతులు ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రభుత్వం దగ్గర వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలిముద్ర వేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు ప్రభుత్వం ఈ జాబితాలను ఆర్‌ఎస్‌కేలకు పంపించింది. అంతకముందు ప్రభుత్వం రాష్ట్రంలో 45.65 లక్షల మంది కు అర్హులుగా తేల్చి.. వీరంతా 20వ తేదీ లోగా ఈకేవైసీ చేయాలని సూచించింది. ఈ క్రమంలో రైతులు తమ పొలాల పాసుపుస్తకాల డాక్యుమెంట్లు, ఆధార్‌ కార్డులతో రైతు సేవా కేంద్రాలకు వెళ్లారు. అక్కడ సిబ్బంది కూడా ఉదయం నుంచి ఈ పనుల్లోనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా పూర్తవుతుందో లేదోనని రైతుల్లో ఆందోళన కనిపించింది. ఈ మేరకు వివిధ శాఖలు తీసుకున్న ఈకేవైసీ జాబితాలను అన్నదాత సుఖీభవ పథకం అర్హులతో లింక్ చేశారు. అయితే మొత్తం 44.19 లక్షల మంది రైతులకు సంబంధించిన వివరాలు సరిపోగా.. మిగిలిన 1.45 లక్షల మంది రైతులు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని తేలింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా చాలామంది రైతులు తాము అన్నదాత సుఖీభవకు అర్హులమో కాదోననే ఆందోళనలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ‘చెక్‌ స్టేటస్‌’ అనే ఆప్షన్‌‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తే ఆధార్ నంబర్ నమోదు చేయగానే అర్హులైన వారి వివరాలు అక్కడ కనిపిస్తాయి. అలాగే రైతులు ఈకేవైసీ చేసుకోవాలో, లేదో కూడా తెలుస్తుంది. అందుకే రైతులు ఆర్ఎస్‌కే (రైతు సేవా కేంద్రాలు)లకు వచ్చి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం దగ్గర వివరాలు లేని 1.45 లక్షలమంది రైతులు మాత్రమే ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు. మొత్తం మీద ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తోంది. ఈ నెలలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20న డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈలోపు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది.