: . హైదరాబాద్‌లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు మే నెలలో స్వల్పంగా పెరిగి, రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందుతున్నట్లు స్పష్టం చేశాయి. నగరం ఆర్థిక కార్యకలాపాలకు, ఉద్యోగ అవకాశాలకు కేంద్రంగా మారడంతో ఇక్కడ సొంతింటి కల నెరవేర్చుకోవాలని చూసేవారి సంఖ్య పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2024 మే నెలలో 6,062 నివాసాల రిజిస్ట్రేషన్లు జరగగా, ఈ ఏడాది మే నెలలో అది 6,177కి పెరిగింది. ఇది వార్షికంగా 2 శాతం పెరుగుదలను సూచిస్తుంది. నెలవారీ వృద్ధి చూస్తే, ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో 5 శాతం పెరిగింది. ముఖ్యంగా, భారీగా పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఈ విభాగం వాటా గతేడాది 14 శాతంగా ఉండగా, ఇప్పుడు ఏకంగా 19 శాతానికి చేరింది. ఇది హైదరాబాద్‌లో ప్రీమియం, లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని స్పష్టం చేస్తుంది.ఇతర కీలక గణాంకాలు..రూ. 50 లక్షల్లోపు, రూ. 50 లక్షల నుంచి రూ. కోటి విలువైన ఆస్తుల లావాదేవీలు స్వల్పంగా తగ్గాయి. అయితే, చదరపు అడుగు సగటు ధర రూ. 4,514గా ఉంది, గత ఏడాదితో పోలిస్తే ఇది 10 శాతం పెరుగుదల నమోదు చేసింది.జిల్లాల వారీగా చూస్తే.. రిజిస్ట్రేషన్ల వాటాలో రంగారెడ్డి జిల్లా 48 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, మేడ్చల్-మల్కాజిగిరి 37 శాతం, హైదరాబాద్ 15 శాతం వాటా కలిగి ఉన్నాయి.2,000 చదరపు అడుగులు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన పెద్ద ఇళ్ల రిజిస్ట్రేషన్ల వాటా 18 శాతంగా ఉంది. ఇది విశాలమైన నివాస స్థలాలకు ప్రాధాన్యత ఇస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని సూచిస్తుంది.రికార్డు స్థాయిలో లావాదేవీలు..మే నెలలో జరిగిన అత్యధిక విలువైన రిజిస్ట్రేషన్లలో ఒకటి రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో నమోదైంది. ఇక్కడ రూ. 17 కోట్ల విలువైన స్థిరాస్తి లావాదేవీ జరిగింది. అలాగే, రంగారెడ్డి జిల్లాలోని మంఖాల్‌లో రూ. 14.69 కోట్లతో, కొండాపూర్‌లో రూ. 13.09 కోట్లతో విలువైన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బంజారాహిల్స్‌లో కూడా రూ. 6.18 కోట్లు; రూ. 6.25 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులు రిజిస్టర్ అయ్యాయి.ఛార్జీలు తగ్గించండి: బిల్డర్స్ అసోసియేషన్ వినతి.. గ్రేటర్ ఈస్ట్‌జోన్ బిల్డర్స్ అసోసియేషన్-యువజన విభాగం ఇటీవల మంత్రి శ్రీధర్‌బాబుకు వినతిపత్రం అందజేసింది. వారి ప్రధాన డిమాండ్లు ఇవి..నాలా తనఖా తొలగింపు: ప్రాజెక్ట్ ఆమోదం సమయంలో బిల్డర్లు అనేక తనఖాలు పెట్టాల్సి వస్తోంది (మున్సిపల్ తనఖా 10 శాతం, నాలాకు 5 శాతం). నాలా తనఖాను పూర్తిగా తొలగించాలని కోరారు.రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో రాయితీ: ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కలిపి 7.6 శాతంగా ఉన్నాయి. ఇవి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నందున, 2-3 శాతం రాయితీ ఇవ్వాలని, మహిళల పేరున చేస్తే అదనంగా 1-2 శాతం రాయితీ ఇవ్వాలని కోరారు.తూర్పు హైదరాబాద్ అభివృద్ధి: పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉపాధి అవకాశాలు కేంద్రీకృతం కావడంతో తూర్పు వైపు నివాసితులు ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు హైదరాబాద్‌ను కూడా ఐటీ, పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు.ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ వేగవంతం: జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏలలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (OC) జారీని వేగవంతం చేయాలని కోరారు. జాప్యం వల్ల డెవలపర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని, డిజిటల్ విధానం, గడువు నిర్దేశించి ఓసీలను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.