ఇరాన్-ఇజ్రాయేల్ సైనిక ఘర్షణలు పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో టెహ్రాన్‌లోని పౌరులు తక్షణమే వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. పరిస్థితి చేజారిపోకముందే ఇజ్రాయేల్‌తో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని, ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్’‌లో పోస్టు పెట్టారు. కెనడా వేదికగా జరుగుతోన్న జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధంపై స్పందించారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధానికి దారితీసేలా ఉన్నాయి. ఇరాన్ అణు ఒప్పందంపై సంతకం చేసి ఉండాల్సిందని ట్రంప్ అన్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయలేదని ఆయన పదే పదే చెప్పారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల వల్ల యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ‘నేను చెప్పిన అణు ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసి ఉండాల్సింది. ఇప్పుడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది ఎంత సిగ్గుమాలిన చర్య" అని ట్రంప్ అన్నారు. అంతేకాకుండా "ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయలేదు. ఇప్పటికే పదే పదే చెప్పా. అందరూ టెహ్రాన్‌ను ఖాళీ చేయాలి" అని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. యుద్ధం ఆగాలంటే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇజ్రాయేల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం సోమవారం నాడు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయేల్‌పై 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయేల్ కూడా ఇరాన్‌పై దాడులు చేసింది. టెహ్రాన్ గగనతలంపై తమ ఆధిపత్యం చెలాయిస్తున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాకుండా ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇరాన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది.టెల్ అవివ్, హైఫా నగరాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 8 మంది పౌరులు మరణించారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయేల్ ఆరోగ్య శాఖ తెలిపింది. టెల్ అవివ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం దగ్గర కూడా ఒక క్షిపణి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.ఇజ్రాయేల్ కూడా దీటుగా స్పందించింది. టెహ్రాన్ గగన తలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం నాడు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) నిఘా చీఫ్, డిప్యూటీ చీఫ్‌లని ఇజ్రాయేల్ మట్టుబెట్టింది. చేసింది. న్యూస్ రీడర్ వార్తలు చదువుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. IRIB కార్యాలయం ఉన్న ప్రాంతంలోని మూడు జిల్లాలను ఖాళీ చేయాలని ఇజ్రాయేల్ సైన్యం ముందుగానే ఇరాన్ పౌరులను హెచ్చరించింది.యుద్ధం విజయం మాదే అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. తమ యుద్ధ విమానాలు ఎప్పుడంటే అప్పుడు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని తెలిపింది. ఇరాన్ క్షిపణి వ్యవస్థల్లో మూడో వంతు భాగాన్ని నాశనం చేశామని పేర్కొంది. దీనిని నెతన్యాహు ధ్రువీకరించారు. యుద్ధ విమానాలతో ఇరాన్ అణు కేంద్రాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తామని ఆయన అన్నారు. టెహ్రాన్ గగన తలంపై నియంత్రణ సాధించడం ఈ యుద్ధంలో కీలక మలుపు అని ఆయన అభివర్ణించారు. ఇజ్రాయేల్ విజయపథంలో ఉందని ఆయన చెప్పారు.ఆదివారం జరిగిన దాడుల్లో IRGC నిఘా సంస్థ అధిపతి బ్రిగేడియర్ మహమ్మద్ కజేమి, డిప్యూటీ చీఫ్ హసన్ మొహాక్విక్ హతమయ్యారు. ఇంటెలిజెన్స్ అధికారి మొహసెన్ బఘేరి కూడా మృతి చెందినట్లు ఇరాన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈశాన్య టెహ్రాన్‌లోని ఒక బంకర్‌లో ఖమేనీ తన కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు సమాచారం. ఖమేనీ నివాసం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. దీంతో ఆయనను బంకర్‌కు తరలించారు.ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగుతున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంటులో బిల్లును సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. అయితే తాము సామూహిక జనహనన ఆయుధాల తయారీకి వ్యతిరేకమని ఇరాన్ స్పష్టం చేసింది. అణ్వస్త్ర వ్యాప్తిని అరికట్టే ఈ అంతర్జాతీయ ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేసింది. దీనిపై సంతకాలు చేసిన దేశాలు అణ్వాయుధాల తయారీ, సంపాదించడం, బదిలీ వంటివి చేయకూడదు.