ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో బీసీ కులం పేరు మార్చింది.. ఓ పదాన్ని తొలగించింది. రాష్ట్రంలో బీసీ-ఏలోని దాసరి సామాజిక వర్గానికి సంబంధించి . ఈ మేరకు దాసరి సామాజిక వర్గానికి చెందిన వారికి కుల ధ్రువీకరణ పత్రాలు (క్యాస్ట్ సర్టిఫికేట్) జారీ చేసే సమయంలో.. దాసరి పక్కన బ్రాకెట్‌లో గతంలో 'భిక్షాటన చేసే వారు' అని రాసేవారు. అయితే ఇలా భిక్షాటన చేసేవారు అని రాయడంతో తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉంందని ఆ సామాజిక వర్గం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ పదాలను తొలగించాలని రిక్వెస్ట్ చేశారు.. వినతిపత్రాలు అందజేశారు. దాసరి సామాజికవర్గం వారు రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే సమయంలో రాసే ఆ పదాలను తొలగిస్తూ సవరణ చేసింది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అధికారులు ‘దాసరి’ అని మాత్రమే పేర్కొంటూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది.ఏపీ ప్రభుత్వం మరికొన్ని కీలక ఉత్తర్వులుజీవీఎంసీ (మహా విశాఖ నగరపాలక సంస్థ) కమిషనర్‌‌ను ప్రభుత్వం నియమించింది. 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి కేతన్‌గార్గ్‌కు ఆ బాధ్యతల్ని అప్పగించింది. కేతన్‌గార్గ్‌ ప్రస్తుతం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఉన్నారు..అయితే రాజమహేంద్రవరం కమిషనర్‌గా ఇంకా ఎవర్నీ నియమించలేదు. 'ఏపీ ప్రభుత్వం కేంద్ర రహదారి నిధి(సీఆర్‌ఎఫ్‌) పథకం కింద చేసిన రోడ్ల పనులకు సంబంధించి రూ.275 కోట్లు విడుదల చేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సీఆర్‌ఎఫ్‌ కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.382 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్ల విడుదలకు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు గుత్తేదార్లు బిల్లులు అప్‌లోడ్‌ చేశాక, వీరికి చెల్లింపులు చేస్తే.. ఆ మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్‌మెంట్‌ చేస్తుంది' అని ప్రభుత్వం తెలిపింది. 'ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం కార్యదర్శులుగా పనిచేసే ఐఏఎస్‌ అధికారుల పనితీరు మదింపు నివేదిక (పెర్ఫార్మెన్స్‌ అప్రైజల్‌)కు సంబంధించి ‘రిపోర్టింగ్‌ అథారిటీ’గా సీఎం ముఖ్య కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరు మదింపు నివేదిక రూపొందించడంలో రిపోర్టింగ్, రివ్యూయింగ్, యాక్సెప్టింగ్‌ అధికారులను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఇది వరకు జీవోలు జారీ చేసింది. ముఖ్యమంత్రి కార్యదర్శులకు సంబంధించి మాత్రం రిపోర్టింగ్‌ అథారిటీ ఎవరన్న ప్రస్తావన వాటిల్లో లేదు. ఈ నేపథ్యంలో 2021 ఏప్రిల్‌ 10న జారీ చేసిన జీవోలో సవరణ చేస్తూ ఉత్తర్వుల జారీ చేసినట్లు' ప్రభుత్వం తెలిపింది. 'ఏపీ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల సొసైటీ (ఏపీఆర్‌ఈఐ)కి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా ఏపీఆర్‌ఎస్‌ తాడికొండ ప్రిన్సిపల్, సభ్యులుగా ఏపీఆర్‌ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్‌ వైఎన్‌ఎస్‌ చౌదరి, పూర్వ విద్యార్థి వై.వెంకట నారాయణ, వైద్యులు విజయలక్ష్మీ, టీచర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుసూదన్‌రావులు ఉంటారని పేర్కొంది. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ, సాంఘిక, గిరిజన, బీసీ సంక్షేమ పాఠశాలల కార్యదర్శులు, నవోదయ విద్యాలయం డీడీ, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ, ప్రజా గ్రంథాలయాల డైరెక్టర్లు ఉంటారు' అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.