ఆయనే కనుక బతికి ఉండుంటే ప్రజారాజ్యం, జనసేన పార్టీలు స్థాపించేవారు కాదంటూ జనసేన పార్టీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరో కాదు .. ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారు ఉండరు. ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వంగవీటి రంగా ప్రస్తావనకు వచ్చింది.. రంగా బతికి ఉండుంటే ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ స్థాపించే పరిస్థితి ఉండేదా అని నాగబాబును అడిగారు. ఆ ప్రశ్నకు నాగబాబు స్పందించారు.'వంగవీటి రంగా ఉండుంటే అసలు ఆ అవసరం ఏముంటుంది.. ఓ గొప్ప వ్యక్తి, పదిమందికి సాయం చేసే గొప్ప నాయకుడు ఉండుంటే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు ఆ అవసరం ఏం ఉండేది ( సొంత పార్టీలు పెట్టాల్సిన అవసరం). ఆయన కనుక సీఎం అయితే మాకు బాధ్యతలు తగ్గేవి, మేం హాయిగా ఉండేవాళ్లం, చక్కగా సినిమాలు చేసుకునేవాళ్లం. తప్పనిసరి పరిస్థితుల్లో ముందు చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంటరవ్వాల్సి వచ్చింది. ఎవరో ఒకరు ఆ బాధ్యతలు తీసుకోవాలి కాబట్టి. రంగా బతికి ఉండుంటే ప్రజారాజ్యం, జనసేన పార్టీలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు.. ఆ రెండు పార్టీలు అవసరం లేదు. రంగా గారు బాగా పనిచేస్తారని తెలుసు' అంటూ వ్యాఖ్యానించారు. వంగవీటి రంగా బతికి ఉంటే చిరంజీవి ప్రజారాజ్యం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలు స్థాపించేవారు కాదన్నారు.వంగవీటి మోహనరంగా 1947 జులై 4 న కృష్ణ జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో జన్మించాడు. అయితే తన సోదరుడు వంగవీటి రాధాకృష్ణరావు మరణంతో మోహనంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఈ క్రమంలో దేవినేని కుటుంబంతో ఆధిపత్య విభేదాలు ఉన్నాయి. ఈ క్రమంలో కొన్ని హత్యలు జరిగాయి.. ఆ తర్వాత వంగవీటి రంగా విజయవాడలోని గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో ఉండగా.. 1988 డిసెంబరు 26 తెల్లవారుజామున ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యతో కోస్తాలోని పలు జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు జరిగాయి.. ఈ క్రమంలో కర్ఫ్యూ విధించారు. వంగవీటి రంగా 1985లో ఎమ్మెల్యేగా గెలిచారు. రంగా మరణంతో ఆయన కుమారుడు రాధాకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు.వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ తరఫున 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. రాధా 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. వంగవీటి రాధా 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.. ఆ పార్టీ అభ్యర్థులు తరఫున ప్రచారం చేశారు. అప్పటి నుంచి టీడీపీలోనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూడా కూటమి పార్టీల తరఫున ప్రచారం చేశారు.