అమర్‌నాథ్ యాత్రికులకు అలర్ట్.. జులై 1 నుంచి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు

Wait 5 sec.

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. హిమాలయ కొండల్లో జులై 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అమర్‌నాథ్ యాత్ర కోసం దేశవ్యాప్తంగా యాత్రికులు తరలిరానున్నారు. అయితే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌‍లో అమాయక పర్యాటకులే లక్ష్యంగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే అన్ని మార్గాలను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించింది. అమర్‌నాథ్ యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం.. జులై 1వ తేదీ నుంచి ఆగస్టు 10 వ తేదీ వరకు పహల్గాం ఉగ్రదాడి, బాల్తాల్ మార్గాల్లో డ్రోన్‌లు, బెలూన్లు, ఇతర మానవ రహిత వైమానిక వాహనాల ప్రయాణంపై నిషేధం విధించారు. జులై 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ అమర్‌నాథ్ యాత్ర సజావుగా సాగేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ఏటా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల భద్రతకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అమర్‌నాథ్ యాత్ర సాగే అన్ని మార్గాలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ హోం శాఖ మంగళవారం దీనిపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులు పహల్గామ్ మార్గంతో పాటు బాల్తాల్ మీదుగా వెళ్తూ ఉంటారు. ఈ రెండు ప్రధాన మార్గాలను ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం నో యింగ్ జోన్‌గా ప్రకటించింది.అయితే ఈ రెండు మార్గాల్లో జులై 1వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మానవ రహిత వైమానిక వాహన వ్యవస్థలు, డ్రోన్‌లు, బెలూన్‌లు వంటివి ఎగురవేయడంపై పూర్తి నిషేధం విధించారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ ఆంక్షల నుంచి మినహాయింపులు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో అత్యవసర వైద్య తరలింపు, విపత్తు నిర్వహణ, భద్రతా దళాల నిఘా, వీటికి సంబంధించిన పూర్తి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ త్వరలోనే జారీ చేస్తామని జమ్మూ కాశ్మీర్ హోంశాఖ అధికారులు వెల్లడించారు.జులై 3వ నుంచి అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న సందర్భంగా.. తాజాగా తీసుకున్న ఈ భద్రతా ఏర్పాట్లు యాత్రకు సజావుగా, శాంతియుతంగా సాగేందుకు ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా యాత్రికులకు అదనపు రవాణా సదుపాయాలను కూడా కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కట్టుదిట్టమైన చర్యలు భక్తులకు భద్రతపై భరోసా కల్పిస్తాయని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం భావిస్తోంది.