: భారతదేశం ఆర్థికంగా దూసుకుపోతోంది అనడానికి మరో బలమైన నిదర్శనం! దేశంలో అత్యంత పేదరికం గణనీయంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రీసెర్చ్ తన తాజా నివేదికలో మంగళవారం వెల్లడించింది. 2023లో దేశంలో అత్యంత పేదలు 6.35 శాతంగా ఉండగా, 2024 నాటికి ఈ సంఖ్య 4.6 శాతానికి తగ్గిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న ప్రగతిని చాటుతోంది. ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం, 2023లో మనదేశంలో అత్యంత పేదలు 5.2 శాతం మంది ఉన్నారు. గతంలో రోజుకు 2 డాలర్ల ఆదాయానికి దిగువన ఉన్నవారిని నిరుపేదలుగా పరిగణించేవారు. అయితే, ఇటీవల ప్రపంచ బ్యాంకు ఈ పరిమితిని రోజుకు 3 డాలర్లకు (సుమారు రూ. 257) సవరించింది. ఈ కొత్త నిర్వచనం ప్రకారం చూసినా కూడా భారతదేశంలో అత్యంత పేదల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలో పయనిస్తోందని సూచిస్తోంది.భారతదేశ వృద్ధిరేటు జనవరి-మార్చి త్రైమాసికంలో 7.4 శాతంగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి వృద్ధిరేటు 6.4 శాతంగా ఉంది. ఇదే సమయంలో, సానుకూల పరిణామం. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ తన తాజా సమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించింది. అధిక వృద్ధి సాధనకు ఇది దోహదపడుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ విశ్లేషించింది. ముఖ్యంగా, మూలధన సమీకరణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే అధిక వృద్ధి సాధ్యమవుతుందని నివేదిక పేర్కొంది. అయితే, దేశంలో ప్రైవేటు వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసింది.పదేళ్ల క్రితం, అంటే ఒక దశాబ్దం కిందట.. భారతదేశంలో పేదల సంఖ్య చాలా అధికంగా 27.1 శాతంగా ఉండేది. ప్రస్తుత గణాంకాలు, భారతదేశం ఆర్థికంగా కొన్ని కీలక విజయాలు సాధించినందున పేదరికం గణనీయంగా తగ్గిందని నిరూపిస్తున్నాయి.ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్.. మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది. భారతదేశంలో గృహ రుణభారం ఇతర చాలా దేశాలతో పోలిస్తే తక్కువగా ఉంది. ఇతర వర్ధమాన దేశాల్లో సగటు గృహ రుణభారం 49.1 శాతం కాగా, మనదేశంలో ఇది 42 శాతం మాత్రమే. గతంలో సగటున అధిక రుణభారం తక్కువ మందిపై ఉండేది. ఇప్పుడు సగటున తక్కువ రుణభారం ఉండగా, రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. దీనితో పాటు రుణాల నాణ్యత కూడా మెరుగుపడిందని నివేదిక వివరించింది.