అమ్మకానికి ఆర్సీబీ..! ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం.. ఏం చెప్పిందంటే?

Wait 5 sec.

: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్‌లో విజేతగా నిలిచింది. ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి.. తొలి టైటిల్ కైవసం చేసుకుంది. అయితే విజేతగా నిలిచాక.. ఆర్సీబీ చేపట్టిన విజయోత్సవ వేడుకలు విషాదంగా మారాయి. కోల్పోయారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. . అయితే ఈ వార్తలు ఆర్సీబీ యాజమాన్యం అయిన కంపెనీ ఖండించింది.ఆర్సీబీని అమ్ముతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆ వార్తలన్నీ ఊహాజనితాలే అని స్పష్టం చేసింది. ఆర్సీబీ అమ్మకానికి చర్చలు కూడా జరగలేదని పేర్కొంది. ఈ మేరకు కంపెనీ కార్యదర్శి మిట్టల్ సంఘ్వీ.. భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటింగ్ బాడీకి లేఖ రాశారు. డియాజియో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో రిజిస్టర్ అయి ఉంది. అమ్మకం వార్తల తర్వాత స్టాక్ మార్కెట్‌లో డియాజియో యాజమాన్యంలోని షేర్లు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అమ్మకం వార్తలపై బీఎస్‌ఈ డియోజియోకు మెయిల్ చేసింది. అయితే అవన్నీ అవస్తవాలే అని డియాజియో స్పష్టం చేసింది.2008లో ఐపీఎల్ తొలిసారి ప్రారంభమైంది. ఇందులో మొత్తంగా 8 జట్లు పాల్గొన్నాయి. అప్పుడు యూబీ గ్రూప్ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. ఆర్సీబీ ఫ్రాంఛైజీని దక్కించుకున్నారు. ఆ తర్వాత మాల్యా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీంతో ద్వారా.. డియాజియో కంపెనీ.. ఆర్సీబీ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి డియాజియో కంపెనీనే ఆర్సీబీకి ఓనర్‌గా ఉంది. అయితే ఆర్సీబీ టైటిల్ గెలిచాక.. డియాజియో ఫ్రాంఛైజీని అమ్మేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి. ఫ్రాంఛైజీ ధరను సుమారు రూ.17,000 కోట్లుగా నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటినీ ఆర్సీబీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఫ్రాంఛైజీని అమ్మడం లేదని వెల్లడించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు.