బీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు. బాత్రూంలో పల్లా కాలుజారి పడిపోగా.. ఆయన కాలు విరిగినట్లు తెలిసింది. దీంతో వెంటనే ఆయన్ను అంబులెన్స్‌లో హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ తరలించారు. కాళేశ్వరం కమిషన్ ముందు నేడు కేసీఆర్ విచారణ ఉండగా.. గతరాత్రే పల్లా ఫాంహౌస్‌కు చేరుకున్నట్లు తెలిసింది. రాత్రి ఆయన ఫాంహౌస్‌లోనే బస చేయగా.. ఇవాళ ఉదయం బాత్రూంకి వెళ్లి కాలు జారి గాయపడినట్లు తెలిసింది. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా, గంతలో మాజీ సీఎం . అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత 2023 డిసెంబర్‌లో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కాలు జారి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆయనకు తుంటి ఎముక విరిగింది. ఆ తర్వాత ఆయనకు యశోద ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఆయన కోలుకోవటానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. చాలా రోజుల వరకు కర్ర సాయంతోనే నడిచారు. తాజాగా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఫాంహౌస్‌లోనే కాలు జారి కిందపడ్డారు.ఇదిలా ఉండగా.. హాజరుకానున్నారు. ఈ పరిణామంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. విచారణకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రిని కలిసేందుకు బుధవారం ఉదయం భర్త అనిల్‌తో కలిసి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఇటీవల పార్టీ వ్యవహారాలపై కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు, కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఉదయం 11.30 గంటలకు బీఆర్కే భవన్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట కేసీఆర్ విచారణ ఉండగా భారీగా పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, నాణ్యత లోపాలు, ఆర్థిక అక్రమాలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన లోపాలు, డిజైన్ సమస్యలు, ఆర్థిక నిర్వహణపై దృష్టి సారించింది.