తెలంగాణ . రాష్ట్రంలో దీంతో లబ్ధిదారుల సంఖ్య మూడు కోట్లను దాటింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం ద్వారా మే నెలాఖరు నాటికి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3,11,28,921కి చేరుకున్నట్లు సివిల్ సప్లయ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 26న రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో పాత కార్డుల్లో కొత్త పేర్ల నమోదుకు కూడా పౌరసరఫరాల శాఖ అవకాశం కల్పించింది. దీనికి అనుగుణంగా మీ-సేవ కేంద్రాలతో పాటు కులగణన సర్వే ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి.అందిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు జనవరి 26, ఫిబ్రవరి 28, ఏప్రిల్ 24, మే 23 తేదీల్లో నాలుగు విడతల్లో కొత్తగా 2,03,156 రేషన్ కార్డులను మంజూరు చేశారు. అలాగే, తొమ్మిది విడతల్లో పాత కార్డుల్లో 29,81,356 మంది కొత్త సభ్యుల పేర్లను నమోదు చేశారు. రేషన్ కార్డుల మంజూరు ఒక నిరంతర ప్రక్రియ అని, ఇంకా పెద్ద సంఖ్యలో పరిశీలించాల్సిన దరఖాస్తులు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. కులగణన సర్వే ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం కుటుంబాల సంఖ్య 1,15,71,457. ప్రస్తుతం పాతవి, కొత్తవి కలిపి మొత్తం 91,98,438 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి, ఇది మొత్తం కుటుంబాలలో 79.49 శాతం కుటుంబాలకు ఉన్నాయని విషయాన్ని వెల్లడిస్తుంది. కొత్తగా మంజూరైన రేషన్ కార్డుల మంజూరు పత్రాలను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం రేషన్ లబ్ధిదారులకు ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. ఇది లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని సర్కార్ భావిస్తోంది. వర్షకాలం సీజన్ నేపథ్యంలో జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన రేషన్‌ను పంపిణీ చేస్తున్నారు. ఈనెలాఖరు వరకు మూడు నెలలకు సరిపడా రేషన్ తీసుకోవచ్చునని అధికారులు తెలిపారు.