ఏపీలోని ఈ రైల్వే స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్ రైలు ఆగుతుంది.. వాళ్ల ఎన్నో ఏళ్ల కలనెరవేరింది

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మరో రైల్వే స్టేషన్‌లో కొత్తగా ఎక్స్‌ప్రెస్ రైలు ఆగనుంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏపీలోని రాయలసీమ ప్రాంతవాసులు ఢిల్లీ వెళ్లేందుకు ఎక్కాల్సిన సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇకపై రాజంపేట లో ఆగుతుంది. నేటి నుంచి ఈ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు రాజంపేటలో కూడా ఆగుతుందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు రైల్వే అధికారులు. నిన్నటి వరకు సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు రాజంపేటలో ఆగేది కాదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వ్యయప్రయాసలకోర్చి ఇతర ప్రాంతాలకు వెళ్లి రైలు ఎక్కాల్సి వచ్చేది. దీంతో ఈ రైలును రాజంపేటలో కూడా ఆపాలని గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధులు రిక్వెస్ట్ చేశారు.. అయినా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి స్థానిక ప్రజాప్రతినిధులు మళ్లీ ప్రయత్నాలు చేశారు. చివరికి నేటి నుంచి రాజంపేట స్టేషన్‌లో సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు నిలిపేందుకు ఉన్నతాధికారులు అంగీకరించారు. ఈ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు తిరుపతి నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళుతుంది. ఈ రైలు ఏపీలోని తిరుపతి, రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, డోన్, కర్నూలులో ఆగుతుంది. తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌నగర్, కాచిగూడ, కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు రాయలసీమ ప్రాంత నుంచి ఢిల్లీ వెళ్లేవారికి సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే రైల్వేశాఖను కోరగా రాజంపేటకు హాల్ట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. భారత్‌ గౌరవ్‌ పర్యాటక యాత్రలో భాగంగాఈనెల 14న గంగా-రామాయణ పుణ్య క్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ టూర్‌లో యాత్రికులు వారణాసి, అయోధ్య, నైమిశారణ్య, ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతాలను సందర్శించవచ్చు. 'ఈ రైలు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలదేరి భువనగిరి, జనగాం, కాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస, బ్రహ్మపూర్‌, ఖుర్దా రోడ్‌, జూత్‌కరాజ్‌, భువనేశ్వర్‌, భువనేశ్వర్‌ రోడ్‌, బాలాసోర్‌ స్టేషన్‌లలో ఆగుతుంది' అని తెలిపారు. ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఈనెల 22వ తేదీ రాత్రి 10.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. 'ఈ టూర్ ప్యాకేజీల్లో ఎకానమీ పెద్దలకు రూ.16,200, పిల్లలకు (5నుంచి 11 ఏళ్ల లోపు) రూ.15,200, స్టాండర్డ్‌ (3 ఎసీ) పెద్దలకు రూ.26,500, పిల్లలకు రూ.25,300, 2ఎసీ పెద్దలకు రూ.35,000, పిల్లలకు రూ.33,600'గా నిర్ణయించారు.