అంతర్జాతీయ క్రికెట్‌లో గత కొంతకాలంగా ఇంగ్లండ్ జట్టు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. టెస్టుల్లో ఒక రకంగా రాణిస్తున్నప్పటికీ అటు వన్డే, ఇటు టీ20ల్లో మాత్రం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ఆ కారణంతోనే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన కెప్టెన్సీకి రాజీనామా చేసేశాడు. ఆ తర్వాత యువ ఆటగాడు చేతికి ఈసీబీ సారథ్య పగ్గాలు అప్పగించింది. తొలి సిరీస్‌లోనే తనేంటో నిరూపించుకుని నూతన శకం ఆరంభించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంగ్లండ్ ఆడిన తొలి సిరీస్ వెస్టిండీస్‌పైనే. బట్లర్ అనంతరం ఇంగ్లండ్ వైట్ బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న హ్యారీ బ్రూక్‌కి కూడా ఇదే మొదటి సిరీస్. స్వదేశం వేదికగా జరిగిన ఈ సిరీస్‌లో హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా విజయం సాధించాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ రెండింటినీ క్లీన్ స్వీన్ చేసి సత్తా చాటాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు చాలా సునాయాసంగా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక టీ20ల్లో చాలా బలవంతమైన విండీస్‌ను ఎదుర్కోవడమే కాకుండా ఘన విజయాలు సొంతం చేసుకుంది. మూడు టీ20ల్లోనూ ఇంగ్లండ్ జట్టు విజయం సాధించడం విశేషం. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో మూడు వన్డేలు, మూడు టీ20లు రెండింటిలోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది. రెండు సిరీస్‌లలో ఇంగ్లండ్‌‌కు విజయాన్ని అందించిన హ్యారీ బ్రూక్‌కి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, ఆ దేశ మాజీ ఆటగాళ్లతో పాటు అభిమానుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఓటమి ఎరుగకుండా వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలవడం విశేషం. అయితే స్వదేశీ గడ్డపై అది కూడా అంతపెద్ద ట్రాక్ రికార్డు లేని విండీస్‌పై గెలిచిన బ్రూక్ సేన.. భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లపై కూడా ఇలానే గెలుస్తుందా? విదేశీ టూర్లలో కూడా హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు ఇలానే రాణిస్తుందా? అనేది ప్రశ్నార్థకం.