విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీకనకదుర్గమ్మకు దేశం నలుమూలలకు చెందిన భక్తులు కానుకలు, ముడుపులుగా విలువైన వస్తువులు, ఆభరణాలను అందజేస్తుంటారు. తాజాగా, తెలంగాణకు చెందిన ఓ కుటుంబం దుర్గమ్మకు కానుకలు సమర్పించి.. అమ్మవారిపై తమ అంచంచల భక్తిని చాటుకుంది. జగన్మాతకు వస్తు వాహనాలు సమర్పించారు. వరంగల్ జిల్లాలకు చెందిన జి. భూపాల్ రెడ్డి.. కనకదుర్గమ్మకు కారు, బంగారు నెక్లెస్‌ను అందజేశారు. ఆయన కుటుంబసమేతంగా వచ్చి ఇంద్రకీలాద్రికి వచ్చిన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం రూ.4.75 లక్షలు విలువైన రెనో క్విడ్‌ కారు, 21 గ్రాముల బంగారు నక్లెస్‌ను దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ ఈవో వీకే శీనానాయక్‌కు శనివారం అందించారు. అనంతరం భూపాల్ రెడ్డి కుటుంబానికి అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులు ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.గత నెలలోనే తెలంగాణకు చెందిన నేతన్న..సమర్పించిన విషయం తెలిసిందే. సిరిసిల్ల జిల్లాకు నల్ల విజయ్ కుమార్ .. 5.5 మీటర్ల పొడవు, 40 ఇంచుల వెడల్పుతో.. వంద గ్రాముల బరువు ఉండే చీరను అగ్గిపెట్టెలో పట్టేలా తయారు చేశారు. అనంతరం విజయవాడ ఆలయానికి కుటుంబసమేతంగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. .దీనికి ముందు ఈ ఏడాది జనవరిలో నల్ల విజయ్ కుమార్ , వేములవాడ రాజన్నకు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన అగ్గిపెట్టెలో పట్టేలా పట్టు శాలువాను కూడా నేసి కొండగట్టు అంజన్నకు సమర్పించారు. వెండి కొంగు చీర, బంగారు చీరలను కూడా గతంలో ఆయన మగ్గంపై తయారయ్యాయి.ఇక, విజయవాడ దుర్గమ్మకు గతేడాది తయారు చేయించి సమర్పించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్పంగా అమ్మవారికి వచ్చే కానుకలకు కొదువే ఉండదు. కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు దుర్గమ్మకు ఆభరణాలు అందజేశారు. వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను కానుకగా ఇచ్చారు.