ఏపీలో కూటమి ఏడాది పాలనపై 'ప్రోగ్రెస్ రిపోర్ట్'.. వచ్చే నాలుగేళ్లలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి?

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సిల్వర్ స్క్రీన్‌పై కూటమి సూపర్ హిట్ కొట్టి ఏడాది అవుతోంది.. ఏకంగా 161 సీట్ల బంపర్ మెజార్టీతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్‌ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లో ఆధ్వర్యంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ సహకారంతో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లలా పరుగులు తీస్తోంది. ఓ వైపు అభివృద్ధి.. మరోవైపు సంక్షేమం చేసుకుంటూ ముందుకు సాగుతామంటోంది. ఎలా సాగింది.. ప్రజలకు అందించిన సంక్షేమం ఏంటి.. వచ్చే నాలుగేళ్లలో ఎదురయ్యే సవాళ్లు ఏంటి?.కి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టింది.. రాజధాని అమరావతి, పోలవరం, రోడ్లకు మరమ్మతులతో పాటుగా సూపర్ సిక్స్‌లో భాగంగా వరుసగా పథకాలను అమలు చేస్తోంది. పింఛన్ డబ్బుల్ని రూ.4వేలకు పెంచారు.. డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీలకు నిధులు, గ్రామాల్లో రోడ్లు, రైతులకు సాయం, ఉద్యోగాల భర్తీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రాజధాని అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి.. పోలవరం ప్రాజెక్టుకు మళ్లీ పనులు మొదలయ్యాయి. కూటమి ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి రూ.990 కోట్ల నిధులు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే 4 వేల కిలోమీటర్ల రోడ్లు వేసింది. రాష్ట్రంలో 13,218 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా 20 వేలకు పైగా గ్రామీణ పేదలకు మినీ గోకులాలు నిర్మించారు. పశువుల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో 20 వేల నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. అనకాపల్లి జిల్లాలో రూ.1.85 లక్షల కోట్లతో NTPC గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు, శ్రీసిటీలో రూ.5 వేల కోట్లతో LG ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, రూ.65 వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు, అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, రామాయపట్నంలో రూ.96,862 కోట్లతో BCPL రిఫైనరీ, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో MSME పార్కులు ఏర్పాటు దిశగా అడుగులుపడుతున్నాయి. ఇలా భారీగా పెట్టుబడులు వచ్చాయి.ఎన్డీఏలో టీడీపీ ముఖ్యమైన భాగస్వామిగా ఉండటంతో కేంద్రం రాష్ట్రానికి సహాయం చేస్తోంది. చంద్రబాబు నాయుడు ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,400 కోట్లు సాధించారు. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలకు కేంద్రం రూ.5 వేల కోట్లు ఇచ్చింది.విశాఖకు రైల్వే జోన్ మంజూరు చేయడంతో పాటు నిర్మాణ పనులు మొదలయ్యేలా చూసింది. రూ.72 వేల కోట్ల హైవే ప్రాజెక్టులు, రూ.70 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టు పనులకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రూ.2245 కోట్లతో అమరావతికి 57 కిలోమీటర్ల రైల్వే లైన్ మంజూరు చేసింది.మిగిలిన పథకాల విషయానికి వస్తే.. దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవో రద్దు చేశారు.. మత్స్యకారుల సేవ పథకం ద్వారా రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు.. 21 ప్రధాన దేవాలయాల్లో నిత్య అన్నదాన పథకాన్ని తీసుకొచ్చారు. ఈ నెలలోనే "అన్నదాత సుఖీభవ" పథకాన్ని కూడా అమలు చేయనున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఇవాళ "తల్లికి వందనం" నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలులోకి రానుంది. అంతేకాదు WhatsApp గవర్నెన్స్ మన మిత్ర ద్వారా 350 రకాల సేవలు అందిస్తున్నారు. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణుల వేతనాలను రూ.25 వేలకు పెంపు.. చేనేతలకు GST ఎత్తివేశారు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు, హ్యాండ్ లూమ్స్ కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయించారు.. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా టీచర్లకు మేలు చేసేలా 117 జీవో రద్దు చేయడంతో పాటు యాప్ ల భారం తగ్గించారు. ఉద్యోగులకు ఏడాది కాలంలో రూ.7500 కోట్లు విడుదల చేశారు. . అంగన్వాడీలు, ఆశాలకు రూ.1.5 లక్షల మేర లాభం చేకూరేలా గ్రాట్యుటీ అమలు చేశారు. పోలీసులకు రూ.213 కోట్ల సరెండర్ లీవుల సొమ్ము విడుదల చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో 5 చోట్ల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖలో TCSతో ఒప్పందం చేసుకుని స్థలం కేటాయించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూములు కేటాయించారు. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఎలాగైనా 2029 నాటికి అమరావతి, పోలవరం ప్రాజెక్టును ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. కేంద్రం సహకారంతో వచ్చే నాలుగేళ్లు అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తామంటోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా కూటమి ప్రభుత్వానికి నిధుల సమస్య వెంటాడుతుండగా.. కేంద్రం సహకారంతో ముందుకు సాగుతామంటున్నారు. ఓ వైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మరో వైపు అభివృద్ధిని కొనసాగించాలంటే అంత ఆషామాషీ కాదు.. వచ్చే నాలుగేళ్లు ఎన్నో సవాళ్లు ఎదురవ్వడం ఖాయమనే చెప్పాలి. మరి చంద్రబాబు తనకు ఉన్న అనుభవంతో ఎలా డీల్ చేస్తారో చూడాలి.