ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే.. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం.. సూపర్ సిక్స్‌లో భాగమైన పథకాన్ని అమలు చేస్తుంది. స్కూళ్లు తెరిచే నాటికే లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేశారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే.. వారందరికీ అందజేశారు. అయితే కొందరికి అర్హత ఉన్నా సరే నిధులు జమ కాలేదు. మరి కొన్ని చోట్ల బ్యాంకు అధికారులు తల్లికి వందనం నిధులను పాత బకాయిల చెల్లించడానికి వినియోగించుకుంటున్నారు. మరికొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు వెలుగు చూశాయి. ఈ సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ కీలక ప్రకటన చేసింది. అర్హత ఉండి కూడా తల్లికి వందనం నిధులు రాని వారి ఇలా చేస్తే వెంటనే నిధులు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఆ వివరాలు.. ఏపీలో అర్హత ఉండి ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సాంకేతిక సమస్యల వల్ల నిధులు జమ కాకపోతే.. మనమిత్ర వాట్సాప్, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేస్తే.. వెంటనే పరిష్కరించి.. అర్హులైతే నిధులు విడుదల చేస్తామని తెలిపింది. అంతేకాక పలు ప్రాంతాల్లో ఫైనల్ లిస్ట్‌లో అనేక లోపాలున్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిదిద్దేందుకు అధికారులకు సూచనలు చేసింది. అలానే కొందరు లబ్దిదారులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలు వాడుకలో లేవు. అలాంటి వారిని గుర్తించని ప్రభుత్వం.. మెసేజ్‌ల ద్వారా వారిని అప్రమత్తం చేసింది. అంతేకాక తల్లికి వందనం అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. అయితే గుర్తించిన అధికారులు వాటిని సరి చేయడానికి వెంటనే చర్యలు చేపట్టారు. ఇక ఇప్పటి వరకు దాదాపుగా 84 వేల మంది వివరాల్లో తలెత్తిన పొరపాట్లను సరి చేశారు. ప్రస్తుతం మిగిలి వారి వివరాలను సరిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు. ఈతప్పుల్లో ప్రధానంగా కనిపిస్తున్న మిస్టేక్ ఏంటంటే.. చాలా మంది పిల్లలకు ఒకే తల్లి పేరు రాసుకొచ్చారు. అలానే ఒకే ఆధార్ నంబర్‌తో అనేక మంది పేర్లను లింకప్ చేసినట్లు లిస్ట్‌లో కనిపిస్తుంది. అధికారులు వీటిని సరిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారు.రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం ద్వారా 67,27,624 మంది లబ్ధిదారులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక ఈ పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులు ఉన్నా సరే.. వారందరికి నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. తల్లికి వందనం కిందప్రభుత్వం ప్రకటించిన 15 వేల రూపాయల్లో 2 వేలు కట్ చేసి.. 13 వేల రూపాయలు మాత్రమే లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుంది.