ప్రతిష్ఠాత్మక లో దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓటమి పాలైన తర్వాత ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించకపోవడం, పేలవ ప్రదర్శన చేయడంతో ఆ జట్టు పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఇటీవల పేలవ ప్రదర్శన చేస్తున్న ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్ లాంటి ప్లేయర్లను జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ మాత్రం.. ఐపీఎల్‌లో ఆడిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు.ఆస్ట్రేలియా జట్టు ప్రయోజనాలకంటే కొందరికి ఐపీఎల్‌ ఎక్కువైందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. జోష్ హేజిల్‌వుడ్‌ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించాడు. మిచెల్‌ స్టార్క్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌, నాథన్‌ లైయన్‌తో కూడిన బౌలింగ్‌ ‘బిగ్‌ ఫోర్‌’ విఫలమైందని మిచెల్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా హేజిల్‌వుడ్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. “ఇటీవల కాలంలో పై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అతడు జాతీయ జట్టు కంటే ఐపీఎల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. వాయిదా పడ్డ అనంతరం ప్రారంభమైన ఐపీఎల్‌కు తిరిగి వెళ్లాలన్న అతడి నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక స్పిన్నర్ లైయాన్ వికెట్లు పడగొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. పేలవ ప్రదర్శన చేస్తున్న లబుషేన్‌ను కొనసాగించడం ఏమాత్రం కరెక్టు కాదు. అయితే ఒకేసారి జట్టులోని టాప్ ఆర్డర్‌ను ప్రక్షాళన చేయలనుకోవడం కూడా ప్రమాదకరమే. సెలక్టర్లకు ఈ విషయం తెలుసనే అనుకుంటున్నా,” అని మిచెల్ జాన్సన్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.కాగా ఐపీఎల్‌ 2025లో హేజిల్‌వుడ్ ఆర్సీబీ తరఫున ఆడాడు. ఈ టోర్నీలో 12 మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఏకంగా 22 వికెట్లు తీశాడు. ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యను ఔట్ చేశాడు. ఐపీఎల్ ఫైనల్ జూన్ 3న జరగ్గా.. ఆ తర్వాతే అతడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు ఆసీస్ జట్టులో చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో 34 ఓవర్లు వేసి కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు.