గతవారం చోటుచేసుకున్న చరిత్రలో తీవ్ర విషాదంగా నిలిచిపోయింది. విమానంలోని 242 మందిలో ఒక్కడు మాత్రమే మృత్యువును జయించాడు. అయితే, ఈ విమానంలో టిక్కెట్ బుక్ చేసుకుని.. అనేక కారణాలతో చివరి నిమిషంలో ప్రయాణించనివారు పలువురు చావును తప్పించుకున్నారు. వీరిలో గుజరాత్‌కు చెందిన ఒక డాక్టర్.. తన భార్య, కుటుంబసభ్యుల సూచనతో ప్రయాణం రద్దుచేసుకుని ప్రాణాలను కాపాడుకున్నారు. తన ప్రాణాలు కాపాడిన భార్య, కుటుంబ సభ్యులకు ఆయన నిరంతరం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు టిక్కెట్ బుక్ చేసిన ఆ వైద్యుడు.. టిక్కెట్ రద్దు చేయకపోయింటే లో ప్రయాణించేవాడు. గుజరాత్‌కు చెందిన డాక్టర్ ఉమాంగ్ పటేల్ తన భార్య, కుమారులు, తల్లిదండ్రులతో కలిసి మే 24న యూకే నుంచి మహిసాగర్ జిల్లాలోని తన పూర్వీకుల గ్రామం కొయ్డం‌కు వచ్చారు. జూన్ 12న భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఇండియాలో వదిలి, ఒక్కడే బ్రిటన్‌లోని నార్థాంప్టన్‌కు తిరిగి వెళ్లాలని ఆయన ప్రణాళిక వేసుకున్నారు. ‘నేను జూన్ 12న తిరుగు ప్రయాణం కావాలి.. కానీ, జూన్ 9న మా అత్తగారింటికి వెళ్లిన తర్వాత నాకు జ్వరం వచ్చింది. తీవ్రమైన జ్వరం కావడంతో మరుసటి రోజు లేచే స్థితిలో కూడా లేను’ అని డాక్టర్ పటేల్ తెలిపారు.ఉమాంగ్ ఆరోగ్యం పట్ల ఆందోళనతో ఉన్న ఆయన భార్య, టిక్కెట్‌ క్యాన్సిల్ చేసుకుని, కొద్దిరోజుల వరకు వెళ్లొద్దని సూచించారు. అందుకు డాక్టర్ పటేల్ అంగీకరించారు. ‘నా భార్య వెళ్ళొద్దని చెప్పిన తర్వాత నేను జూన్ 12 టిక్కెట్‌ను రద్దు చేశాను. మళ్లీ జూన్ 15కి మరో టిక్కెట్ బుక్ చేసుకున్నాను. అంతలోనే విమాన ప్రమాద ఘటన జరిగింది.. ఆ దేవుడు నన్ను కాపాడాడు. ఆ విమానంలో ఉన్న అందరి ఆత్మలకు శాంతి చేకూరాలని దేవునిని ప్రార్థిస్తున్నాను’ అని పటేల్ అన్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు పటేల్ కుటుంబాన్ని పరామర్శిస్తూ.. మానసికంగా బలంగా ఉండమని ధైర్యం చెబుతున్నారు. డాక్టర్ పటేల్ గత ఐదేళ్లుగా నార్థాంప్టన్‌లో ఉంటున్నట్టు తెలిపారు. మే 24న వచ్చిన పటేల్.. జూన్ 2న వెళ్లాలని భావించారు. స్వదేశానికి వచ్చిన తర్వాత, ఆయన తండ్రికి గుండెపోటు రావడంతో ముందుగా జూన్ 2కి బుక్ చేసిన టిక్కెట్‌ను కూడా రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. జూన్ 9న భార్యతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కాగా, ప్రమాదానికి ముందు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.డాక్టర్ పటేల్ తండ్రి డాక్టర్ ఉమాంగ్‌భాయ్ పటేల్ మాట్లాడుతూ... జూన్ 12న తన కుమారుడ్ని ప్రయాణానికి అనుమతించలేదని తెలిపారు. ‘మే 24న లండన్ నుంచి అహ్మదాబాద్‌కు మా విమాన ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే, కొన్ని మల్టీమీడియా ప్లేయర్ బటన్‌లు పాడయ్యాయి, ఏసీ వెంటిలేటర్ పనిచేయలేదు’ అని డాక్టర్ పటేల్ తెలిపారు.