హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు.. ఉత్తరభాగం పనులపై కీలక అప్డేట్

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఉత్తర, దక్షిణ రెండు భాగాలుగా ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగు రోడ్డు నుంచి సుమారు 40 కి.మీ దూరంతో ఈ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. బిడ్లు సమర్పించడానికి జూన్ 18 వరకు మాత్రమే గడువు ఉండగా.. 19న టెండర్లను తెరవాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబరు 27న భారత జాతీయ రహదారుల అధికార సంస్థ (NHAI) ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం పనుల కోసం ఐదు ప్యాకేజీలుగా టెండర్లను ఆహ్వానించింది. కానీ ఆరు నెలలుగా ప్రతి నెలా టెండర్ల గడువును పొడిగిస్తూ వస్తోంది.ఇక ఉత్తర భాగాన్ని ముందుగా నాలుగు వరుసల రహదారిగా నిర్మించాలనుకున్నా.. తెరపైకి వచ్చింది. అయితే ఆరు వరుసల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం నుండి ఇంకా ఆమోదం లభించలేదు. ఆరు వరుసల రహదారికి మార్చాల్సి వస్తే.. ఎన్‌హెచ్‌ఏఐ మళ్లీ టెండర్లను పిలవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ట్రాఫిక్ సర్వేతో పాటు మరోసారి డీపీఆర్‌పై అధ్యయనం చేసింది. రెండు రోజుల్లో బిడ్ల దాఖలు గడువు ముగియనుండటంతో ఎన్‌హెచ్‌ఏఐ గడువును మళ్లీ పొడిగిస్తుందా? లేక కొత్త ప్యాకేజీలతో ఆరు వరుసల రహదారికి టెండర్లను పిలుస్తుందా? అనే సందిగ్ధత కొనసాగుతోంది.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం పనులను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇవాళ మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఆర్‌ఆర్‌ఆర్‌ పనులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగం పనులను కూడా చేపట్టాలని కేంద్రాన్ని తరచుగా కోరుతోంది. ఒకవేళ కేంద్రం ఆమోదించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఈ పనులను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రాజెక్టు విషయానికొస్తే.. మెుత్తం పొడవు సుమారు 340 కిలోమీటర్లు. ఉత్తర భాగం సుమారు 161 కిలోమీటర్లు (సంగారెడ్డి - నర్సాపూర్ - తూప్రాన్ - గజ్వేల్ - ప్రజ్ఞాపూర్ - యాదాద్రి - భువనగిరి - చౌటుప్పల్) వరకు దక్షిణ భాగం పనులు సుమారు 182 కిలోమీటర్లు (చౌటుప్పల్ - శివన్నగూడెం - కందుకూరు - ఆమన్‌గల్ - చేవెళ్ల - శంకర్‌పల్లి - సంగారెడ్డి) వరకు నిర్మించనున్నారు. మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.17 వేల కోట్ల నుంచి రూ.21 వేల కోట్లు. 2026 నాటికి ఉత్తర భాగం, 2027-2028 నాటికి దక్షిణ భాగం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరం చుట్టూ కనెక్టివిటీ మెరుగుపడి, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టూ స్థిరాస్థి రంగం పుంజుకుంటుంది.