: మీరు ఏదైనా టూర్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే బెటర్ అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. కేవలం బస్ టికెట్ ధరకే విమాన ప్రయాణం చేయవచ్చు. దిగ్గజ ఎయిర్‌లైన్స్ అయిన ఇండిగో మరోసారి బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. గెట్ అవే సేల్ ()పేరుతో ప్రత్యేక పరిమిత కాల తగ్గింపు సేల్ తెచ్చింది. దీని ద్వారా కేవలం రూ. 1199 కే ఫ్లైట్ టికెట్లు అందిస్తోంది. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ (IndiGo) తమ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో స్పెషల్ వన్ వే ఫేర్స్ తీసుకొచ్చింది. అలాగే యాడ్ ఆన్స్ పై ప్రత్యేక తగ్గింపు సైతం ఇస్తోంది. వాట్సాప్ 7065145858 లేదా ట్రావెల్ పార్ట్నర్ల ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక పరిమిత కాల ఆఫర్. జూన్ 4, 2025 రోజున టికెట్ల బుకింగ్ మొదలైంది. జూన్ 6, 2025 అర్ధరాత్రి 23.59 గంటల వరకు టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్పెషల్ సేల్ ద్వారా టికెట్లు బుకింగ్ చేసుకుని జూన్ 12, 2025 నుంచి సెప్టెంబర్ 24, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. మీకు అనుకూలమైన టైంలో ట్రిప్ ప్లాన్ చేసుకుని టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్గాల్లో అయితే రూ. 4,599 నుంచి టికెట్ ధరలు మొదలవుతున్నాయి. ముంబై- విజయవాడ, కడప-హైదరాబాద్, గోండియా- హైదరాబాద్, సేలం- హైదరాబాద్, కడప- విజయవాడ మధ్య తిరిగే విమానాల్లోనూ టికెట్ ధర రూ. 1199కే లభిస్తోంది. మరోవైపు.. యాడ్ ఆన్స్‌పై ప్రత్యేక తగ్గింపు కల్పిస్తోంది ఇండిగో. డొమెస్టిక్ రూట్లలో అదనపు లగేజీపై ప్రీ బుకింగ్ చేస్తే 50 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. ప్రీ బుకింగ్ మీల్స్ పై 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఎమర్జెన్సీ ఎక్సెల్ సీట్స్ రూ. 500 నుంచి మొదలవుతున్నాయి. రూ. 299 ప్లాన్ తీసుకుంటే జీరో క్యాన్సలేషన్ ఛార్జీలు ఉంటాయి. ఈ ఆఫర్ ఇండిగో ఆఫరేట్ చేస్తున్న నాన్ స్టాక్, మల్టీ సిటీ, కెనెక్టింగ్ ఫ్లైట్స్ కి మాత్రమే వర్తిస్తుంది. పూర్తి వివరాలకు ఇండిగో అధికారిక వెబ్‌సైట్ చూడాలని కంపెనీ తెలిపింది.