ఇది! మూడు సార్లు చేతిదాకా వచ్చి చేజారిన ట్రోఫీని ఒక్కసారిగా కళ్లెదుటుగా నిలబడటంతో కింగ్ కళ్లల్లో నుంచి కన్నీరు కారింది. ఫైనల్స్ గెలవగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్‌లో కూర్చొని ఏడ్చేశాడు. ఆ తర్వాత తన భార్య అనుష్క శర్మని పట్టుకుని చంటిపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 18 సంవత్సరాలుగా తన గుండెల్లో ఉన్న బాధ ఇలా బయటకు తన్నుకొచ్చింది. ఐపీఎల్ ట్రోఫీ కల. 2009, 2011, 2016 ఇలా మూడు సార్లు ఫైనల్స్‌కి వచ్చినా ట్రోఫీని అందుకోలేకపోయింది. ఐపీఎల్ 18వ ఎడిషన్.. విరాట్ కోహ్లి జెర్సీ నెంబర్ కూడా 18 కావడంతో.. ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని అందుకుని కింగ్‌కి ట్రిబ్యూట్ ఇవ్వాలని డిసైడ్ అయింది. అందుకు తగ్గట్టుగానే సీజన్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనతో విజయవిహారం చేసింది. చివరికి ఫైనల్స్‌లో పంజాబ్‌ని ఓడించి కోట్లాది మంది అభిమానులకు అంకింతం చేసింది. ఆర్సీబీ ఫైనల్స్ మ్యాచ్‌ని వీక్షించేందుకు అనుష్క శర్మతో పాటు మిస్టర్ టీ20 ఏబీ డివిలియర్స్ కూడా స్టేడియానికి వచ్చారు. ఇక మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది అనే సమయానికి డివిలియర్స్ బౌండరీ దగ్గరే ఉన్నాడు. విరాట్ కోహ్లి కూడా డివిలియర్స్ ఉన్న చోటుకి వచ్చి ఆఖరి ఐదు ఓవర్లు అక్కడే ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముందుగా ఏబీడీని హగ్ చేసుకున్నాడు. ఏబీ డివిలియర్స్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్‌లో సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి నేరుగా దగ్గరకు వెళ్లాడు. విరాట్ రావడాన్ని చూసిన అనుష్క శర్మ పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్‌ను హగ్ చేసుకుంది. అప్పటికే కన్నీళ్లతో ఉన్న కోహ్లి.. అనుష్కను హగ్ చేసుకుని చంటిపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. విరాట్ కోహ్లి కన్నీళ్లు తుడిచిన అనుష్క.. మనం గెలిచాము అంటూ అనింది. ట్రోఫీని అందుకున్న తర్వాత అనుష్క శర్మ-విరాట్ కోహ్లి కలిసి సంబరాలు చేసుకున్నారు.