Upcoming IPOs: లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎదురుచూస్తున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్. మరో 6 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. అందులో ప్రధాన ఆకర్షణగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ నిలుస్తోంది. దీంతో పాటుగా మరో 5 సంస్థలు సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. అందులో ఏ వన్ స్టీల్స్ ఇండియా, విక్రమ్ సోలార్, శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్, శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ లిమిటెడ్, డోర్ఫ్ కేటల్ కెమికల్స్ వంటివి ఉన్నాయి. ఈ ఐపీఓలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతులు ఇచ్చింది. మొత్తంగా ఈ ఆరు కంపెనీలు కలిసి రూ.20,000 కోట్లకుపైగా నిధులు సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను సమర్పించాయి. హెచ్‌డీఎఫ్‌సీ నుంచి మరో ఐపీఓ.. ఐపీఓకు వస్తున్నట్లు సమాచారం. సెబీ వద్ద ముసాయిదా పత్రాలు సమర్పించగా తాజాగా అనుమతులు మంజూరయ్యాయి. హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 2,500 కోట్ల తాజా ఈక్విటీ షేర్లు, రూ. 10 వేల కోట్లు విలువైన ఆఫర్ ఫర్ సేల్ షేర్లను విక్రయించనున్నారు. ప్రస్తుతం ఇందులో కొంత భాగం ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇక డోర్ఫ్ కేటల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ రూ. 5000 కోట్లు సమీకరించేందుకు ఐపీఓకు వస్తోంది. రూ. 1500 కోట్లు తాజా ఈక్వీటీ షేర్లు కాగా రూ.3500 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ షేర్లు ఉన్నాయి. అలాగే సోలార్ మాడ్యూల్ తయారీ సంస్థ విక్రమ్ సోలార్ రూ. 1500 కోట్ల ఫ్రెస్ షేర్లు జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 17.45 మిలియన్ ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. ఏ వన్ స్టీల్స్ ఇండియా లిమిటెడ్ రూ. 600 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.50 కోట్ల షేర్లను విడుదల చేస్తున్నారు. శ్రీజి షిప్పింగ్ గ్లోబల్ లిమిటెడ్ రూ.308 కోట్ల షేర్లు తాజా షేర్లను విడుదల చేస్తోంది. శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ రూ.255 కోట్లు సమీకరించనుంది. ఇందుకోసం 1.8 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను విక్రయిస్తోంది.