ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.62వేలు జీతం, ఉత్తర్వులు వచ్చేశాయి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ ఒప్పంద లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 'రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న 309 ఒప్పంద లెక్చరర్లతో పాటుగా 116 వర్క్‌షాప్‌ సిబ్బంది సేవల్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ జూన్‌ 1వ తేదీ నుంచి 2026 ఏప్రిల్‌ 30 వరకు 11 నెలలపాటు వీరి సేవల్ని ప్రభుత్వం పొడిగించింది. వీరికి నెలకు రూ.61,960 జీతం చెల్లించేలా ప్రభుత్వం. వాస్తవానికి వీరి జీతాన్ని 54,060కి తగ్గించేందుకు డైరెక్టరేట్‌ ప్రతిపాదనలు పంపించగా.. లెక్చరర్ల అభ్యర్థన మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జీతం తగ్గకుండా చర్యలు తీసుకున్నారు' అని పాలిటెక్నిక్‌ ఆల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. మంత్రి లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల రేషనలైజేషన్‌పై విచారణ జరపాలని అధ్యాపకుల సంఘాల సమన్వయ వేదిక డిమాండ్ చేసింది. పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టుల హేతుబద్ధీకరణ సరిగా జరగలేదని అధ్యాపకుల సంఘాలు ఆరోపించాయి. ఈ విషయంపై విచారణ జరపాలని అధ్యాపకుల సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కోరారు. విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకోకుండా పోస్టులను కేటాయించారని.. కొన్ని కాలేజీల్లో అవసరం లేకపోయినా పోస్టులు ఇచ్చారన్నారు. కడప జిల్లా సింహాద్రిపురం పాలిటెక్నిక్‌లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా ముగ్గురు ఫిజిక్స్ లెక్చరర్లను కేటాయించారన్నారు. మెకానికల్‌ విభాగంలో అవసరం లేకపోయినా సీనియర్‌ లెక్చరర్‌ను ఇచ్చారని.. ప్రొద్దుటూరులో 1,800 మంది విద్యార్థులు ఉండగా.. గణిత శాస్త్రంలో కేవలం ఒక సీనియర్‌ లెక్చరర్‌ను మాత్రమే కేటాయించారన్నారు. ఇలా ఎన్నో లోపాలతో అసంబద్ధంగా చేసిన హేతుబద్ధీకరణను నిలిపివేయాలని కోరారు. మరోవైపు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) వైద్య సలహామండలి సభ్యుడిగా డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావును నియమించారు. డాక్టర్ శ్రీహరిరావు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీహరిరావు నెల్లూరు జిల్లా కావలికి చెందినవారు.. ఈ అడ్వయిజరీ కౌన్సిల్ వైద్య విద్య, శిక్షణ, పరిశోధన విభాగాల్లో ఎన్‌ఎంసీకి సలహాలు ఇస్తుంది. అలాగే, రాష్ట్రాల సమస్యలను ఎన్‌ఎంసీ దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారానికి సహాయపడుతుంది. వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేసే హెల్త్ ఎడ్యుకేటర్ పోస్టు హోదాను ప్రభుత్వం మార్చింది. ఇకపై వారిని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌గా పిలుస్తారు. హెల్త్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ, సెంట్రల్ యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హెల్త్ ప్రమోషన్ అండ్ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తిచేసిన వారు జోనల్ స్థాయిలో హెల్త్ ఎడ్యుకేటర్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెల్త్ ఎడ్యుకేటర్స్ సర్వీస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు.