కెనడా వేదికగా జరగబోయే G7 శిఖరాగ్ర సదస్సుకు భారత్‌కు ఆహ్వానం అందలేదు. ఆరేళ్లలో తొలిసారిగా ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. ఈ నెల 15 నుంచి 17 వరకు కెనడాలోని అల్బెర్టాలో ఈ సదస్సు జరగనుంది. అయితే, జీ7 నుంచి భారత్‌కు ఆహ్వానం అందకపోవడంపై ప్రతిపక్ష తీవ్ర విమర్శలు చేసింది. ఇది మోదీ సర్కారు దౌత్యపరమైన వైఫల్యమని ఆరోపించింది ఈ సదస్సులో పశ్చిమాసియా పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా ప్రపంచం ఎదుర్కొంటోన్న అనేక సవాళ్లపై చర్చించే అవకాశం ఉంది. గతేడాది హాజరైన సంగతి తెలిసిందే.భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కొనసాగుతోన్న వేళ జీ7 నుంచి ఆహ్వానం అందకపోవడం గమనార్హం. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, కెనడాతో పాటు జర్మనీ దేశాధినేతలు G7 సదస్సులో పాల్గొంటారు. బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఉక్రెయిన్, ఆస్ట్రేలియా దేశాల అధినేతలకు కూడా ఆహ్వానం అందింది. కానీ, భారత్‌కు మాత్రం ఆహ్వానం పంపలేదు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ఈ విషయంపై స్పందించారు. ‘2014కు ముందు ఇది G8గా ఉండేది.. అప్పటి ప్రధాని మన్మోహన్‌కు ఆహ్వానం వచ్చేది. 2014 తర్వాత కూడా ఈ సంప్రదాయం కొనసాగింది.. కానీ, ఆరేళ్లలో తొలిసారి మన ప్రధానికి ఆహ్వానం అందలేదు. ఇది దౌత్యపరంగా భంగపాటు’ అని ఆయన అన్నారు. అందుతోంది.G7 దేశాల్లో భారత్ లేకపోయినా, ఆయా దేశాల ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గతంలో శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గొన్నారు. గత ఏడాది ఇటలీలో జరిగిన సదస్సుకు భారత్‌తో పాటు ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు కూడా హాజరయ్యాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి ప్రధాని మోదీకి ఆహ్వానం అందే అవకాశం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆహ్వానం వచ్చినా, కెనడా, భారత్‌ల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆయన వెళ్లే అవకాశం లేదు. దీంతో ఆరేళ్లలో తొలిసారి మోదీ G7 సదస్సులో పాల్గొనకపోవచ్చు. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత్‌కు సంబంధం ఉందని 2023లో అప్పటి కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.అయితే, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ నేత మార్క్ కార్నీ విజయంతో సంబంధాలు తిరిగి బలపడే అవకాశం ఉంది. కానీ, కెనడాలోని కొత్త ప్రభుత్వం నుంచి ఆ దేశంలో ఖలిస్థానీ అనుకూల శక్తుల కార్యకలాపాలపై భారత్ ఆందోళనలను పరిష్కరించడానికి ఇంకా స్పష్టమైన సూచనలు లేవు. అలాగే, న్యూఢిల్లీ, కెనడా ఒకరి హైకమిషనర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. కాగా, ‘ప్రధానమంత్రి పర్యటన కోసం, ద్వైపాక్షిక సంబంధాల స్థితిని పరిగణనలోకి తీసుకుని మేము చాలా ప్రాథమిక పనులు చేయాల్సి ఉంది’ అని ఓ సీనియర్ అధికారి వివరించారు. అన్నింటికంటే మించి, భద్రత ఒక ప్రధాన సమస్య అని భారత్-కెనడా సంబంధాల గురించి తెలిసిన మరొక వ్యక్తి అన్నారు.