ప్రస్తుతం తెలంగాణ వాతావరణంలో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారంలో రావాల్సిన నైరుతి రుతుపవనాలు ఈసారి చాలా ముందుగానే తాకాయి. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులు ఇప్పటికే పత్తిగింజలు నాటడం, నార్లు పోయడం వంటి పనుల్లో నిమగ్నమయ్యారు. మరికొందరు పొలాలను చదును చేసుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి తెలంగాణలోని కురుస్తున్నాయి. అయితే అదే సమయంలో పగటిపూట ఎండలు కూడా దంచికొడుతుండటం వింత పరిస్థితిని సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో ఉరుములు, కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగుల కారణంగా ప్రాణనష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది.నేడు (జూన్ 4) కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, వరంగల్, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 4 నుంచి జూన్ 7 వరకు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చు. ఈ రోజు, రేపు హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం పడొచ్చని అధికారులు తెలిపారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందన్నారు. ఉపరితల గాలులు పశ్చిమ నైరుతి దిశలో గంటకు 6 నుండి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పొలాల వద్ద ఉన్నప్పుడు చెట్ల కింద నిలబడొద్దని, చెట్లపై పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.