ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 1 నుంచి షాపుల ద్వారా రేషన్‌ను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు మరో కీలక ప్రతిపాదన వచ్చింది. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన తెరపైకి తీసుకొచ్చారు. ఆ దిశగా ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పులు చేయాలని ఆలోచిస్తోందట. బియ్యం వద్దనుకునే వారికి ఆ డబ్బులు కాకుండా.. అందుకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తోందట. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 1న కోనసీమ జిల్లాలో బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకుని ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యంపై కిలోకు రూ.46 ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువమంది లబ్ధిదారులు బియ్యం తీసుకుని కిలో రూ.10-11కు బయట వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. పేదరికాన్ని గుర్తించడానికి రేషన్ కార్డే ముఖ్యం అని చెప్పాలి.. కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు. ప్రభుత్వం ఇచ్చిన ను ప్రభుత్వ పథకాలైన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య సేవలు వంటి వాటి కోసమే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో బియ్యానికి బదులు ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే ఎక్కువమంది బియ్యం అవసరం లేకపోయినా సరే తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల కోసం నిజమైన పేదల్ని గుర్తించి బియ్యం కార్డుగా మార్చారు. ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులను ఎంపిక చేయడానికి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీని కోసం బియ్యం కార్డును పరిగణలోకి తీసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే పేరు మారినా బియ్యం కార్డుకు డిమాండ్ తగ్గలేదు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.46 కోట్ల ఉంటే.. ఇందులో 30శాతం కుటుంబాలకు (దాదాపు 44 లక్షల మందికి) రేషన్ బియ్యం ఆధారం. వీరిలో మిగిలిన 70శాతంమందికి బియ్యం అవసరం లేకపోయినా బియ్యం కార్డు అవసరం అంటున్నారు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మేయడంతో రేషన్ మాఫియా విస్తరించింది. అలాగే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్ చేసిన తర్వాత పేదలకు పంపిణీ చేస్తోంది. ఇలా చూస్తే ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చుతో పాటుగా కమిషన్ కలిపి కిలో బియ్యానికి రూ.46 ఖర్చు చేస్తున్నట్లు లెక్క ఉంది. రాష్ట్రంలో మొత్తం 1.46 కోట్ల కార్డుల్లో.. 90 లక్షలమందికి కేంద్రం ఉచిత బియ్యం అందిస్తోం. ఇక మిగిలిన 56 లక్షలమందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా రూ.6,193 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ లెక్కన చూస్తే కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే కనుక 20 కిలోల బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వానికి రూ.920 ఖర్చు అవుతోంది. అందుకే ప్రభుత్వం ఆ డబ్బుకు బదులుగా నూనె, కందిపప్పు, ఇతర నిత్యావసరాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తోంది.