ఈసాలా కప్‌ నమ్దూ.. డివిలియర్స్‌, గేల్‌తో కలిసి కోహ్లీ సంబురాలు..!

Wait 5 sec.

గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఆర్సీబీ విజయం ఖరారైన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. సంతోషంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ.. గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఏడుస్తూ గ్రౌండ్‌లోనే కూర్చుండిపోయాడు.తీవ్ర భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీని.. సహచర ఆటగాళ్లు ఓదార్చారు. విరాట్ కోహ్లీ కోసమైనా.. ఈ సీజన్‌ టైటిల్ గెలుస్తామని ముందు నుంచీ చెబుతూ వచ్చిన ఆ జట్టు.. చివరకు అనుకున్నది సాధించింది.కాగా టోర్నీ ప్రారంభ సీజన్‌ నుంచి ఒకటే ఫ్రాంఛైజీకి ఆడుతున్న కోహ్లీ.. టైటిల్ సాధించాక మాట్లాడాడు. “ఈ టైటిల్ జట్టుకు ఎంత ముఖ్యమో.. ఆర్సీబీ ఫ్యాన్స్‌కు కూడా అంతే ముఖ్యం. 18 ఏళ్ల తర్వాత సాధించాం. ఇందుకోసం నా యవ్వనాన్ని ఇచ్చాను. నేను ఎంతవరకు చేయగలనో అంతా చేశాను. నా దగ్గర ఉన్నదంతా నేను ఇచ్చాను. ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. చివరి బంతి వేయగానే భావోద్వేగానికి గురయ్యా,” అని విరాట్ కోహ్లీ అన్నాడు.“ఈ ఫ్రాంచైజీ కోసం చాలా చేశాడు. అందుకే ఈ గెలుపును అతడితో కలిసి జరుపుకోవాలని కోరుకున్నా. అదే విషయం అతడితో చెప్పా. అతడు ఆర్సీబీ కోసం తన శక్తినంతా దారపోశాడు. డివిలియర్స్‌ మాతో పోడియంపై ఉండటానికి అర్హుడు. నా హృదయం బెంగళూరుతోనే ఉంది, నా ఆత్మ బెంగళూరుతోనే ఉంది. నేను ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ కూడా ఆర్సీబీ తరఫునే ఆడతా. ఎట్టకేలకు టైటిల్ మాకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఏబీ డివిలియర్స్, క్రిస్‌ గేల్‌తో కలిసి సంతోషాన్ని పంచుకున్నాడు. వారితో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇకపై తమ నినాదం ఈసాలా నమ్దే కాదని.. ఈసాలా నమ్దూ అని ముగ్గురూ నినాదాలు చేశారు.