సర్పంచ్, MPTC ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఎలక్షన్లకు నోటిఫికేషన్ అప్పుడేనా..?

Wait 5 sec.

తెలంగాణలో కు సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇటీవల హైకోర్టు ఆదేశాలు కొంత స్పష్టతను ఇచ్చాయి. గతేడాదే పదవీకాలం ముగియడంతో.. ఎన్నికల నిర్వహణపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఆశావాహులు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలపై వెలువరించింది. 90 రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. అయితే అంశం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, అన్ని సామాజిక వర్గాలకు కలిపి 50 శాతం రిజర్వేషన్లు మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పు ఈ హామీకి అడ్డుగా నిలుస్తోంది. రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశం నేపథ్యంలో.. రిజర్వేషన్ల అంశాన్ని త్వరగా తేల్చే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలు కీలక చర్చలు జరిపారు. సామాజిక న్యాయ సమరభేరి సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణనపై ప్రజల్లో వచ్చిన సానుకూల స్పందనను ప్రస్తావించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయించాలని మహేశ్‌కుమార్‌గౌడ్ కోరినట్లు సమాచారం. అయితే, ఈ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఆమోదించేలా కాంగ్రెస్ తరఫున ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర నాయకులు కేసీ వేణుగోపాల్‌ను కోరారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించాలనే కోణంలో అధ్యయనం చేయాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం మంచిదని రాష్ట్ర నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం.ప్రభుత్వం తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించి, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగేవి కాబట్టి, వాటిని విడిగా నిర్వహించాలని భావిస్తోంది. గతంలో మాదిరిగానే మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహించి, ప్రతి విడతలో పోలింగ్ ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు.