హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి కరెంట్ కట్.. కారణమిదే

Wait 5 sec.

కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ప్రకటించారు. ఏ ప్రాంతాల్లో.. ఏ సమయానికి విద్యుత్ సరఫరా ఉండదో తెలిపారు. దీని ప్రకారం బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ కానీ, చందానగర్, గాజులరామారం, గ్రీన్ ల్యాండ్స్, ఉప్పల్, మల్కాజిగిరి,పేట్‌బషీరాబాద్ ప్రాంతాల్లో . మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ల మార్పు వంటి పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని.. ప్రజలు ఇందుకు సహకరించాలని అధికారులు కోరారు.దీని గురించి బంజారాహిల్స్ ఏడీఈ జి.గోపి మాట్లాడుతూ.. రవీంద్ర సొసైటీ, మెహర్‌బాబా, జూబ్లీ ఎన్‌క్లేవ్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదు. అలాగే, మాదాపూర్ శ్రీచైతన్య కాలేజ్, పవర్ మెక్ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2-5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారుగ్రీన్‌ల్యాండ్స్, గాజులరామారం..గ్రీన్ ల్యాండ్స్ ఏడీఈ చరణ్ సింగ్ మాట్లాడుతూ.. బేగంపేట పోస్టాఫీస్, పెద్దమ్మనగర్ ఫీడర్ల పరిధిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరెంట్ ఉండదని తెలిపారు. స్వరాజ్ నగర్, ఆదిత్య ఎన్‌క్లేవ్, గ్రీన్ పార్కు హోటల్ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2-5 గంటల వరకు . అలానే గాజులరామారం విద్యుత్‌ సబ్‌-స్టేషన్‌ పరిధిలోని మగ్దూంనగర్‌, జగద్గిరిగుట్ట, శ్రీరామ్‌నగర్‌, ఉషా ముళ్ల పూడి 11 కేవీ ఫీడర్ల పరిధిలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మగ్దూంనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌, నాగార్జున స్కూల్‌ లేన్‌ శ్రీరామ్‌నగర్‌ బేకరీగడ్డ, శ్రీరామ్‌నగర్‌-ఏబీల్లో విద్యుత్‌ను నిలిపి వేయనున్నారుకేపీహెచ్‌బీ కాలనీలో టీజీఎస్పీడీసీఎల్‌ వసంతనగర్ సెక్షన్ పరిధిలో డీసీ వర్క్స్ జరుగుతున్నాయి. అందువల్ల పలు ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ వాణి తెలిపారు.కేపీహెచ్‌బీ ఓల్డ్‌ ఆరో ఫేజ్‌లో ఉదయం 9.30-10 వరకు, న్యూ ఆరోఫేజ్‌లో మధ్యాహ్నం 2-5 గంటల వరకు, గోకుల్‌ ఫ్లాట్స్‌లో మధ్యాహ్నం 3-3.30 వరకు విద్యుత్‌ సరఫరా ఉండదు అని ఆమె పేర్కొన్నారు.ఉప్పల్..ఉప్పల్ సబ్‌స్టేషన్‌ ఏఈ ఎం.నిఖిల్ మాట్లాడుతూ, చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్‌ లైన్ల మార్పులు, ఇతర మరమ్మతుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఆసియన్‌ ఫీడర్‌ పరిధిలోని ఉప్పల్‌ మెయిన్‌ రోడ్డు, స్వరూప్‌ రెడ్డి నగర్‌, ఆసియన్‌ థియేటర్‌ ప్రాంతాలలో ఉదయం 10-11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలానే కల్యాణపురి ఫీడర్‌ పరిధిలో ఉదయం 11-11.30 గంటల వరకు కరెంట్ కోతలుంటాయన్నారు.మల్కాజిగిరి, పేట్‌బషీరాబాద్‌ ప్రాంతాల్లోమల్కాజిగిరిలోని వసంతపురి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో 11 కేవీ గీతాభవానీ ఫీడర్ పరిధిలో విద్యుత్ మరమ్మతులు జరుగుతున్నాయి. దీని కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 2-2.30 వరకు వెంకటేశ్వరనగర్‌, రాఘవేంద్రమఠం, దుర్గానగర్‌, పటేల్‌నగర్‌, హైదర్‌నగర్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ గోపాల్ తెలిపారు.పేట్‌బషీరాబాద్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ సంబంధిత మరమ్మతులు జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఏరియాలోని శనివారం ఉదయం 10-10.30 గంటల వరకు.. దండమూడి ఎన్‌క్లేవ్‌,, సురక్ష ఆస్పత్రి, వీఎ్‌సఎస్‌ నందదీప్‌, పిస్తా హౌస్‌, ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ ప్రాంతాల్లో కరెంట్‌ ఉండదని తెలిపారు.చందానగర్ ఏరియాలో..చందానగర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని 11కెవి ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు హైదనగర్‌ ఏఈ తెలిపారు. 11కెవి లక్ష్మీనగర్‌ ఫాడర్‌ ప్రాంగణంలో ఉదయం 10 గంటల నుంచి 10.30 వరకు చందానగర్‌ రత్నదీప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, లక్ష్మీనగర్‌, బుద్ద అపార్ట్‌మెంట్స్‌, నమహా అపార్ట్‌మెంట్స్‌ ప్రాంగణంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అలానే 11కేవీ శ్రీలా గార్డెన్స్‌ ప్రాంగణంలో ఉదయం 11.30-12 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.