ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్.. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు ముందు అర్జంట్‌గా ఎందుకు వెళ్లారు!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన బుధ, గురువారాల్లో హస్తినలోనే ఉంటారు.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌తో భేటీకానున్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్‌ పాసవాన్‌తో సమావేశం అవుతారు. 'సాయంత్రం 4:30 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. 5:30 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌తో' సమావేశం కానున్నారు. గురువారా ఉదయం కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో సమావేశమవుతారు. ఆ తర్వాత బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో లోకేష్ భేటీకానున్నారు. ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.. ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వచ్చే మూడు రోజుల ముందు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏపీకి సంబంధించిన సమస్యలపై నారా లోకేష్ కేంద్రమంత్రులతో చర్చిస్తారని చెబుతున్నారు. అయితే ఇంత సడన్‌గా హస్తినకు రావడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది. కేంద్రమంత్రుల్ని కలవడం మామూలే కానీ ఉపరాష్ట్రపతిని కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే మర్యాదపూర్వకంగానే జగదీప్‌ ధన్‌ఖడ్‌‌తో సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది. మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆయన తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ప్రధాని నివాసానికి వెళ్లారు. దాదాపు రెండు గంటలపాటూ మోదీతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లా, అమరావతి పర్యటనకు వచ్చిన సమయంలో లోకేష్‌ ఢిల్లీ వచ్చి కలవాలని మోదీ అన్నారు. ఢిల్లీకి వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని మోదీ అడిగారు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలవాలని చెప్పారు. అందుకే లోకేష్ ప్రధాని అపాయింట్‌మెంట్ తీసుకుని కుటుంబంతో కలిసి వెళ్లారు. ప్రధాని, ఆయన కుటుంబంతో కలిసి భోజనం చేశారు. యువగళం పాదయాత్ర విశేషాలతో 'యువగళం' అనే కాఫీ టేబుల్ బుక్‌ను మోదీ ఆవిష్కరించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఒక పుస్తకంపై సంతకం చేసి లోకేష్‌కు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి, దేవాన్ష్‌లను ప్రధాని ఆశీర్వదించారు.