వేములవాడ ఆలయంలో గోవుల వరుస మృతి రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషయంపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కోసం.. వేరే రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యాయనం చేయాలని సూచించారు. ఇందుకోసం ముగ్గురు అధికారులతో కూడిన ఓ కమిటీని నియమించారు. దీనిలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు.తెలంగాణలో గో సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు మంగళవారం తన నివాసంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఎంతో ప్రాధాన్యం ఉందని.. వాటి సంరక్షణకు ఎంత ఖర్చయినా వెనకాడవద్దని.. గోవుల సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గోవుల సంరక్షణకు విధివిధానాల రూపకల్పన చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. వేములవాడలో గత కొన్నాళ్లుగా తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం కావడంతో.. రాష్ట్రంలో కోడె మొక్కులు చెల్లించే ఆలయాలైన వేముల‌వాడ‌, యాద‌గిరిగుట్టతో పాటుగా.. హైద‌రాబాద్ న‌గ‌ర స‌మీపంలోని ఎనికేప‌ల్లి, ప‌శు సంవ‌ర్థక శాఖ విశ్వవిద్యాల‌యం దగ్గరలో ముందుగా నాలుగు గోశాల‌లు నిర్మించాల‌ని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఆయా ఆలయాల్లో భక్తులు సమర్పించే కోడెలపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. అలానే వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.వంటి ఆలయాల్లో.. నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తుంటారని.. అందుకు తగ్గట్టుగా స్థల విస్తీర్ణం లేకపోవడం, ఇతర సమస్యలతో.. గోవులు చనిపోతన్నాయని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించడమే కాక గోవుల సంరక్షణ కోసం రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో.. సౌకర్యవంతంగా.. అన్ని వసతులతో గోశాలలు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.