లొంగిపో.. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఉన్నారనేది తెలుసు, ట్రంప్ బిగ్ వార్నింగ్

Wait 5 sec.

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారనే కచ్చితమైన సమాచారం తమ వద్ద ఉందని.. ఆయనను లక్ష్యంగా చేసుకోవడం సులభమే అయినప్పటికీ ప్రస్తుతానికి చంపే ఉద్దేశం లేదని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ట్రూత్ సోషల్ ద్వారా ఖమేనీకి బేషరతుగా లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఎయిర్‌స్పేస్ తమ కంట్రోల్‌లో ఉందని.. పౌరులు, అమెరికా సైనికులపై క్షిపణి దాడులను సహించేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీం లీడర్ ఎక్కడ దాక్కున్నారో తమకు స్పష్టంగా తెలుసని.. ఆయనను లక్ష్యంగా చేసుకోవడం తమకు చాలా తేలిక అని వెల్లడించారు. ప్రస్తుతానికి ఖమేనీ సురక్షితంగానే ఉన్నారని.. ప్రస్తుతానికి ఆయను చంపే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. అయితే అమెరికా సైనికులపై, పౌరులపై చేసే మిసైల్ దాడులను మాత్రం ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. తమకు సహనం నశిస్తోందని.. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుప్రీం లీడర్ లొంగిపోవాలని మరోసారి స్పష్టం చేశారు.ఇరాన్ గగనతలం మొత్తం అమెరికా నియంత్రణలోనే ఉందని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ వద్ద స్కై ట్రాకర్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఉన్నప్పటికీ.. వాటిని అమెరికా టెక్నాలజీతో పోల్చుకోలేమని వెల్లడించారు. మరోవైపు ఇరాన్ సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ.. సుప్రీం లీడర్ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈశాన్య టెహ్రాన్‌లోని ఒక బంకర్‌లో తన కుటుంబంతో కలిసి ఆయన తలదాచుకున్నట్లు తెలుస్తుండగా.. ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.మరోవైపు.. ఇరాన్‌పై చేస్తున్న దాడులను సమర్థించుకున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి .. ప్రస్తుతం రెండు మధ్య యుద్ధాన్ని పెంచడం కంటే త్వరగా ముగించడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. ఇరాన్ సుప్రీం లీడర్‌ ఖమేనీని హతం చేస్తేనే.. దీనికి ముగింపు అని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతకుముందు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేందుకు ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందని.. అయితే అందుకు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.