మ్యాచ్ ఓడిపోయింది ఇక్కడే.. టీమిండియా కొంపముంచింది వీళ్లే!

Wait 5 sec.

నువ్వా నేనా అన్నట్టు సాగిన ఇంగ్లండ్ - ఇండియా మొదటి టెస్టులో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఆఖరి రోజు ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయాల్సి ఉండటంతో అందరూ మ్యాచ్ డ్రా అవుతుందనే అనుకున్నారు. కానీ ఇంగ్లండ్ మిడిలార్డర్, టేలెండర్స్ ఆ టీమ్‌ని గెలిపిస్తే.. అదే బ్యాటింగ్ ఆర్డర్ టీమిండియా కొంపముంచింది. హెడింగ్లీ టెస్టులో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం భారత్ బ్యాటింగ్ వైఫల్యమనే చెప్పొచ్చు. టాప్ ఆర్డర్ అద్భుతంగా రాణిస్తే.. మిడిలార్డర్, టేలెండర్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కనీసం పట్టుమని పది నిమిషాలు కూడా క్రీజులో నిలవలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్ కంటే దారుణంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మిడిలార్డర్, టేలెండర్స్ విఫలమయ్యారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 3 వికెట్ల నష్టానికి 430 పరుగులు చేస్తే.. 41 పరుగుల తేడాతోనే మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. అదేవిధంగా రెండో ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్ల నష్టానికి 333 పరుగులు చేస్తే.. కేవలం 31 పరుగుల తేడాతో ఆఖరి ఆరు వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్‌లోని కరుణ్ నాయర్ , మ్యాచ్‌ని నిలబెట్టే ప్రయత్నమే చేయలేకపోయారు.టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లు కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్ హెడింగ్లీ టెస్టులో విఫలమయ్యారు. ఎనిమిదేళ్ల తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అందుకు తగ్గట్టు ఆడలేకపోయాడు. రవీంద్ర జడేజా కూడా విఫలం కాగా.. శార్థూల్ ఠాకూర్ కనీసం ప్రభావం కూడా చూపలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన కరుణ్ నాయర్, రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. శార్థూల్ ఠాకూర్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ బాట పట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి వెళ్లిపోయాడు. రవీంద్ర జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసి అవుటవ్వగా.. రెండో ఇన్నింగ్స్‌లో 25 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిడిలార్డర్‌లో ఈ ముగ్గురు ప్లేయర్లలో ఏ ఒక్కరు నిలబడ్డా టీమిండియా మొదటి టెస్టులో ఓడిపోయేది కాదు.