ఫోన్లో ట్రంప్-మోదీ చర్చలు.. అమెరికా అధ్యక్షుడికి గట్టి షాకిచ్చిన ప్రధాని..!

Wait 5 sec.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆయనకు ఝలక్ ఇచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలు, ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చేసుకుని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పక్కాగా దాడులు చేసింది. అదే సమయంలో పాకిస్తాన్ చేసిన ప్రతిదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాను చెప్పడం వల్లే భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశాయని.. చెప్పుకుంటున్నారు. దీనిపై మన దేశంలోని ప్రతిపక్షాలు ప్రధాని మోదీని విమర్శిస్తున్నాయి. ట్రంప్‌కు మోదీ సరెండర్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం.. పాకిస్తాన్ విషయంలో మూడో దేశం మధ్యవర్తిత్వం ఏమీ లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టత ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరిన్ని విమర్శలు గుప్పించారు. మోదీకి ట్రంప్ ఫోన్ చేసి.. నరేందర్, సరెండర్ అని చెప్పగానే ప్రధానమంత్రి.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపేశారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న వేళ.. స్వయంగా ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. వెల్లడించారు.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కెనడాలో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్‌ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే ప్రధాని మోదీ కెనడాలో దిగడానికి ముందే అత్యవసరంగా పర్యటనను ముగించుకున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వెళ్లిపోవడంతో ఈ సమావేశం జరగలేదు. దీంతో ట్రంప్, మోదీ 35 నిమిషాల పాటు ఫోన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందానికి గురించి చర్చలు జరగలేదని విక్రమ్ మిస్రీ వెల్లడించారు. భారత్‌-పాక్ కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా మధ్యవర్తిత్వంపైనా ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ విషయంలో మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయని.. పాక్‌ చేసిన అభ్యర్థన మేరకే ఆపరేషన్‌ సిందూర్‌ను నిలిపివేసినట్లు చెప్పారు. ఇప్పుడు గానీ, ఎప్పుడూ గానీ.. పాకిస్తాన్ విషయంలో భారత్‌ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు అనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ మోదీ స్పష్టంగా చెప్పారని తెలిపారు. అదే సమయంలో కెనడాలో మోదీ-ట్రంప్ మీటింగ్ రద్దు కావడంతో.. మోదీని అమెరికాకు రావాలని ట్రంప్‌ ఆహ్వానించినట్లు విక్రమ్ మిస్రీ వెల్లడించారు. కానీ షెడ్యూల్‌ కారణంగా తాను అమెరికా రాలేనని నరేంద్ర మోదీ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే భారత్ అమెరికా ద్వైపాక్షిక భేటీ నిర్వహించాలని ఇద్దరు నిర్ణయించినట్లు తెలిపారు. ఇక భారత్‌లో జరిగే క్వాడ్‌ సమావేశం కోసం మోదీ ట్రంప్‌ను ఆహ్వానించగా.. అందుకు భారత్‌లో పర్యటించేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని ట్రంప్ చెప్పినట్లు మిస్రీ వెల్లడించారు.