విజయవాడ: అలా చేస్తే జైలు కెళతారు జాగ్రత్త.. రైల్వే అధికారుల సీరియస్ వార్నింగ్

Wait 5 sec.

దేశవ్యాప్తంగా తరచూ రైళ్లపై రాళ్లతో దాడిచేసిన ఘటనల్ని చూస్తున్నాం.. ముఖ్యంగా ఇటీవలి కాలంలో వందేభారత్ రైళ్లపై కొందరు ఆకతాయిలు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. ఏపీలో ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై ముగ్గురు యువకులు రాళ్లతో దాడి చేశారు.. దీంతో రైల్వే అధికారులు మరోసారి హెచ్చరించారు. ఎవరైనా రైళ్లపై రాళ్ల దాడి చేసి రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్ అరుణ్‌కుమార్‌ జైన్‌ విజయవాడలో హెచ్చరించారు. ఎవరైనా కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే 139లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించార.రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 ప్రకారం రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని SCR జనరల్‌ మేనేజరు అరుణ్‌కుమార్‌ జైన్‌ హెచ్చరించారు. 2025 జనవరి నుంచి మే నెల వరకు 100 మందికిపైగా రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామన్నారు. ఈ మొత్తం కేసుల్లో 12 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించి.. ఒక నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మిగిలిన 11మందికి మాత్రం రూ.30,500 జరిమానా విధించినట్లు చెప్పారు. అలాగే ఎవరైనా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులు ఉంచినా నేరమే అన్నారు.. అలా చేసిన 29 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. మరోవైపు రైల్వేశాఖ .. ఈ మేరకు రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వీటిలో 100 మెము రైళ్లు, 50 నమో భారత్, 50 అమృత్‌ భారత్‌ రైళ్లు ఉన్నాయన్నారు. ఈ రైళ్లు అత్యాధునిక వసతులతో సిద్ధమయ్యాయి.. వీటిని ఏ రూట్లలో కేటాయించారనేది క్లారిటీ లేదు. మెము రైళ్లకు గతంలో 8 నుంచి 12 కోచ్‌లు ఉంటే.. ఆ సంఖ్యను 16 నుంచి 20కు పెంచినట్లు తెలిపారు. అలాగే కొత్తగా 50 నమో భారత్ రైళ్లు తయారు చేయాలని భావిస్తున్నట్లే పేర్కొన్నారు.