కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతుల ఖాతాలో డబ్బుల జమ అయ్యాయి. 9 రోజుల పాటు రైతులందరి ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకుగాను ప్రభుత్వం.. 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని రైతులందరకి రైతు భరోసా జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఓ పది మండలాల రైతులకు మాత్రమ భరోసా నిధులు రద్దు చేసింది. ఆ వివరాలు.. జిల్లాలోని పది మండలాల రైతులకు రైతుభరోసా పథకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై సంబంధిత మండలాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ పొలాల్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్, అబ్దుల్లాపూర్, రాజేందర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హయత్‌నగర్‌‌తో పాటుగా మరి కొన్ని మండలాల్లోని రైతులకు ప్రభుత్వం రైతు భరోసా రద్దు చేసింది. కారణం.. వీరంతా ఆకుకూరలు, కూరగాయలు పండించేవారు కావడం.తమకు రైతు భరోసా రద్దు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయాల సాగు వ్యవసాయం కిందకు రాదా.. దానికి పెట్టుబడి ఖర్చు ఉండదా.. మరి ఎందుకు ప్రభుత్వం ఈ కారణం చేత తమకు రైతు భరోసా రద్దు చేసిందని వారు ప్రశ్నిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలు కావడం.. పైగా రవాణా సౌకర్యాలు ఎక్కువగా ఉండటంతోనే తాము త్వరగా చేతికొచ్చే కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టామని ఈ ప్రాంత రైతులు అంటున్నారు. ఈ కారణం చెప్పి తమకు రైతుభరోసాను రద్దు చేయడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ మండలాల రైతులకు విపక్షపార్టీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. వీరికి కూడా రైతు భరోసా ఇవ్వాలని.. లేదంటే బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతేకాక కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకానికి.. కాంగ్రెస్‌ ప్రభుత్వం మంగళం పాడుతున్నదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం తెలంగాణలో రైతు భరోసా నిధుల జమ కార్యక్రమం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు అధికారికంగా ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. 9 రోజుల పాటు రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. అలానే వారికి కూడా భరోసా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.