ఇజ్రాయేల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోన్న ఇరాన్.. . ఇరాన్‌కు చెందిన అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా భీకర దాడుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై తుది నిర్ణయం నేషనల్‌ సెక్యురిటీ కౌన్సిల్‌‌దేనని ఇరాన్ చట్టసభ సభ్యుడు వెల్లడించారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే.. ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం దీని ద్వారానే రవాణా అవుతోంది. దీనిద్వారా రోజుకు 2 కోట్ల బారెళ్ల చమురు సౌదీ, ఇరాన్‌, యూఏఈ, కువైట్‌, ఇరాక్‌ల నుంచి ఎగుమతి అవుతోంది. ఇరాన్‌ అణు కార్యక్రమానికి అత్యంత కీలకమైన కురిపించి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.ఇక, భారత్‌ విషయానికి వస్తే విదేశాల నుంచి వచ్చే ముడి చమురులో 40 శాతం హర్మూజ్‌ జలసంధి ద్వారానే వస్తోంది. ఒకవేళ, హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే భారత్ తన 74 రోజుల నిల్వలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇరాన్ యుద్దం ప్రభావంతో దేశంలో చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళనలు నెలకున్న తరుణంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అస్థిరతను ప్రభుత్వం సన్నిహితంగా పరిశీలిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత కొంతకాలంగా భారత్ తన ఇంధన సరఫరాలను విభిన్న మార్గాల ద్వారా పొందే విధంగా ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు పెద్ద మొత్తంలో సరఫరాలు హార్ముస్ సముద్రద్వారం మార్గంగా రావడం లేదు’ అని మంత్రి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. భారత చమురు మార్కెటింగ్ కంపెనీలకు పలు వారాల సరిపడ ఇంధన నిల్వలు ఉన్నాయని, పలు మార్గాల ద్వారా సరఫరాలు కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ‘దేశ పౌరులకు ఇంధన సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అయితే, ఆయిల్, గ్యాస్ రంగాలు అత్యంత సున్నితమైనవి. హార్మూజ్ జలసంధి మార్గం వారంపైగా మూసివేస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశముందని, భారత్‌ కూడా దాని ప్రభావానికి లోనవుతుందని సూచించారు. ‘ఇది తాత్కాలిక సమస్యే అనుకుంటున్నాం. పరిస్థితి త్వరలో చక్కబడుతుందని భావిస్తున్నాం’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత్ ప్రస్తుతం రష్యా నుంచి ముడిచమురు అధికంగా దిగుమతి చేసుకుంటోంది. అయితే దానిలో లాభం ధరల తగ్గింపులు, డిస్కౌంట్‌లపై ఆధారపడి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 105 దాటితే, ఇంధనంపై ఎక్సైజ్ సుంకాల విషయంలో కేంద్రం పునరాలోచించవచ్చని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.