ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరినట్టు ప్రకటించారు. ఇరు దేశాలూ ‘పూర్తి స్థాయి, సంపూర్ణ’ (ceasefire)కు అంగీకరించాయని, ఇది 24 గంటల్లో అమల్లోకి రానుందని తెలిపారు. ఇది ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించే దిశగా ముందడుగు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మిషన్లను పూర్తి చేసుకునేందుకు ఇరాన్, ఇజ్రాయేల్‌కు కొంత సమయం లభించనుందని, అనంతరం ఈ కాల్పుల విరమణ దశలవారీగా అమల్లోకి వస్తుందని ట్రంప్ వివరించారు.‘అన్ని అనుకున్నట్లే జరిగితే అలా కూడా జరుగుతుంది... ఈ 12 రోజుల యుద్ధానికి ముగింపు పలకడానికి ధైర్యం, మేధస్సు, సహనం కనబరిచిన ఇజ్రాయెల్, ఇరాన్‌లకు అభినందనలు’ అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వెల్లడించారు. ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొద్ది నిమిషాల ముందు ఇరాన్, ఇజ్రాయెల్‌లు మళ్లీ దాడులపై పరస్పరం బెదిరింపులు చేసుకోవడం గమనార్హం. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది.ఇరాన్ వద్దకు ఇప్పటివరకు ఏవిధమైన కాల్పుల విరమణ ప్రతిపాదనను రాలేదని, అలాంటి అవసరం కూడా లేదని,సీనియర్ ఇరానియన్ అధికారి అన్నట్ుట సీఎన్ఎన్ నివేదించింది. అంతకుముందు సోమవారం ట్రంప్ మాట్లాడుతూ, అమెరికన్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ చేసిన దాడిని తక్కువగా తేల్చి చెబుతూ, దానిలో ఎవరికీ గాయాలు కాకపోవడాన్ని ప్రస్తావించారు. అలాగే, దాడికి ముందుగా సమాచారం ఇచ్చినందుకు ఇరాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ ప్రకటనపై ఇజ్రాయెల్ తక్షణమే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే, కొద్ది గంటల ముందు మాత్రం ముగ్గురు ఇజ్రాయెల్ అధికారులు తమ దేశం త్వరలో యుద్ధాన్ని ముగించనున్నట్లు సూచించి, ఆ సందేశాన్ని అమెరికాకు కూడా పంపినట్లు తెలిపారు. అంతకు ముందుసైతం ఇరాన్‌తో ఎక్కువ రోజుల యుద్ధం చేయమని ప్రకటన చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, సోమవారం అర్థరాత్రి ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్ 0.4% పెరిగాయి. దీంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్‌లు లాభాలతో మొదలవుతాయని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. అంతకు ముందు ఆసియా మార్కెట్లు కుదేలై.. స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. అలాగే, చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి.