సాంకేతిక సమస్యతో కేరళలో వారం రోజుల కిందట అత్యవసరంగా ల్యాండైనహ్యాంగర్‌లో పార్క్ చేయలేదు. దీనికి సంబంధించిన ప్రత్యేక సాంకేతికతను ఇతరులకు తెలియకుండా ఉంచాలనే ఉద్దేశంతో బ్రిటన్ నేవీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించింది. జూన్ 14న ఇంధనం తక్కువగా ఉండటంతో ఈ యుద్ధ విమానం తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం దీనిని ఆరుబయటే పార్కింగ్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ విమానంలో అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉన్నాయి. హెచ్‌ఎమ్ఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగమైన దీనిని ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మోహరించారు. ఇది భారతీయ నేవీతో కలిసి నావికాదళ విన్యాసాల్లో పాల్గొంది. జూన్ 14న విమానంలో ఇంధనం తక్కువగా ఉందని సంకేతాలు రావడంతో పైలట్ కేరళలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ విషయాన్ని ఆ మర్నాడు ధ్రువీకరించింది. "అవసరమైన సాయం చేస్తామని" ప్రకటించింది. అప్పటి నుంచి విమానాన్ని ఆరుబయటే ఉంచారు.హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్యను పరిష్కరించడానికి బ్రిటన్ నిపుణులు, పైలట్ ప్రయత్నిస్తున్నారు. విమానానికి భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. యుద్ధ విమానం పౌర విమానాశ్రయంలో కనిపించడంతో ప్రయాణికులు ఆసక్తిగా చూస్తున్నారు. విమానాన్ని హ్యాంగర్‌లో ఉంచడానికి ఎయిర్ ఇండియా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. కానీ బ్రిటన్ నేవీ సున్నితంగా తిరస్కరించింది. అయితే, చివరి తనిఖీల సమయంలో విమానాన్ని హ్యాంగర్‌కు తరలించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉండటంతో ఇతర దేశాలు ఈ టెక్నాలజీని సమీక్షించే అవకాశాన్ని బ్రిటన్ నివారించాలని భావించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అందువల్లే, ఎయిర్ ఇండియా హ్యాంగర్‌లో పార్క్ చేయాలన్న ఆఫర్‌ను రాయల్ నేవీ తిరస్కరించిందని తెలిపాయి. ‘ప్రొటెక్టెడ్ టెక్నాలజీస్’ పై ఉన్న భద్రతా ఆందోళనలు తరలింపులో జాప్యానికి దారితీసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యాధునిక యుద్ధవిమానాలలో ఒకటి కావడంతో దానిని చూసేందుకు ఏవియేషన్ ప్రేమికులు, సాధారణ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.మరోవైపు, సోషల్ మీడియాలో దీనిపై అనేక రకాల మీమ్స్, ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు, ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాన్ని ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్ OLXలో అమ్మకానికి పెట్టారంటూ నెట్టింట్ ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దీని ధరను 4 మిలియన్ల డాలర్లుగా నిర్ణయించినట్టు ఫేక్ పోస్టులు సృష్టించడం గమనార్హం.