టీమిండియా డైనమైట్ బ్యాటింగ్ స్టయిల్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. లో పంత్ బాదిన ఓ షాట్‌కి ఇంగ్లండ్ కెప్టెన్ స్టన్నయ్యాడు. ఆ వెంటనే పంత్ దగ్గరకు పడి పడి నవ్వుకుంటూ వచ్చాడు.. పంత్ సైతం హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లీడ్స్‌లోని హెడింగ్లీ స్టేడియం వేదికగా మొదటి టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ శుభారంభం అందించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. సాయి సుదర్శన్ మినహా మిగతా బ్యాటర్లంతా దూకుడుగా ఆడి తమ సత్తా చూయించారు. సెంచరీ ధీరుడు యశస్వి జైస్వాల్‌ని 53వ ఓవర్‌లో బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మొదటి బంతి నుంచే తన స్టయిల్ బ్యాటింగ్ ప్రారంభించాడు. మొదటి బంతిని డిఫెన్స్ ఆడిన పంత్.. రెండో బంతిని ఫ్రంట్ ఫుట్‌కి వచ్చి బౌలర్ మీదుగా బౌండరీ బాదాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్ షాట్ ఆడటంతో.. మొదట భయపడిన బెన్, తర్వాత నవ్వుకుంటూ పంత్ దగ్గరకు వచ్చాడు. పంత్ స్టయిల్ ఆఫ్ బ్యాటింగ్ గురించి అందరికీ తెలిసిందే. దాంతో బెన్ స్టోక్స్ కూడా పంత్ బ్యాటింగ్‌కి ఆస్వాదించాడు. బౌండరీ తర్వాత పంత్ దగ్గరకు వచ్చి మాట్లాడాడు. కానీ పంత్ మాత్రం ఏ మాట్లడకుండా పిచ్‌‌‌ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఈ మ్యాచ్‌లో పంత్ ఆరు బౌండరీలతో పాటు రెండు సిక్సర్లు కూడా బాదాడు. నాలుగు సిక్సర్లు నమోదైతే పంత్ రెండు బాదగా.. జైస్వాల్, గిల్ చెరొక సిక్సర్ కొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 101, కేఎల్ రాహుల్ 42 పరుగులు చేయగా.. సాయి సుదర్శన్ డకౌట్ అయ్యాడు. శుభమన్ గిల్ 175 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 127, రిషబ్ పంత్ 102 బంతుల్లో 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.