యోగా భారతావనికి దక్కిన గొప్ప గౌరవం.. యోగాంధ్రతో ప్రపంచ రికార్డు: చంద్రబాబు, పవన్

Wait 5 sec.

యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 1.44 లక్షల మంది యోగా శిక్షకులతో రికార్డు సృష్టిస్తున్నామన్నారు.ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్రమంత్రులు, ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు కలిసి పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారని వెల్లడించారు. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని, స్వర్ణాంధ్ర 2047 సాధనలో యోగాకు భాగస్వామ్యం కల్పిస్తామని చంద్రబాబు అన్నారు. జరుపుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంచుతుందన్నారు. గత పదేళ్లుగా మోదీ యోగాను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. గిరిజన విద్యార్థులు 22 వేల మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. ప్రతిరోజు గంట సేపు యోగా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని.. యోగాను అన్ని క్రీడల్లో భాగం చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంలో యోగాకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.175 దేశాల్లో.. 12 లక్షల ప్రదేశాల్లో యోగా చేస్తున్నారు.. ఫిజికల్, మెంటల్ హెల్త్ గా యోగా దోహదం చేస్తుందన్నారు చంద్రబాబు. ఏఐ యోగాను మరింత సులువుగా.. అందరికి దగ్గరగా తీసుకొస్తోందన్నారు. రికార్డులు ఏవైనా మోదీకే సాధ్యం.. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయన్నారు. 1.44లక్షల మంది యోగా శిక్షకులు నమోదు చేసుకున్నారన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ సమక్షంలో చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నామన్నారు. రుగ్వేదం యోగా విశిష్టతను చెబితే.. ప్రధాని నరేంద్ర మోదీ దానిని ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మోదీని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించారు.