హెడింగ్లే వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఫీల్డర్ల వైఫ్లంయో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌ ఆద్యంతం క్యాచ్‌లు నేలపాలు చేసిన భారత ఫీల్డర్లు.. కీలకమైన చివరి రోజు ఆటలోనూ అదే కొనసాగిస్తున్నారు. మ్యాచ్ గెలవాలంటే తప్పక రాణించాల్సిన పరిస్థితిలో అంది వచ్చిన అవకాశాలను చేజేతులా వదిలేస్తున్నారు. ముఖ్యంగా తన ఫీల్డింగ్‌తో భారత బౌలర్లకు విసుగు తెప్పిస్తున్నాడు. తొలి నాలుగు రోజుల ఆటలో మూడు క్యాచ్‌లు మిస్ చేసిన అతడు.. చివరి రోజు కూడా అదే కొనసాగించాడు. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించారు. నిజానికి అంతకంటే ముందే వీరు ఔట్ కావాల్సింది. కానీ భారత ఫీల్డర్ల పుణ్యమా అని వారు బతికిపోయారు. ఈ అవకాశాలతో చెలరేగిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ సెంచరీ సాధించాడు. డకెట్‌ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఇచ్చాడు. సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో భారీ షాట్ ఆడేందుకు అతడు ప్రయత్నించాడు. కానీ బంతి బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న జైశ్వాల్ వైపు వెళ్లింది. క్యాచ్ కోసం డైవ్ చేసిన జైశ్వాల్.. దాన్ని ఒడిసిపట్టలేకపోయాడు. దీంతో క్యాచ్‌ మిస్ అయింది. అప్పటికే వికెట్లు పడక కోపంలో ఉన్న సిరాజ్.. జైశ్వాల్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. కోపంలో జైశ్వాల్ వైపు చూస్తూ నోరు పారేసుకున్నాడు. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గంభీర్‌ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఏం జరుగుతోంది? అన్నట్లు లుక్ ఇచ్చాడు. జైశ్వాల్ చెత్త రికార్డుఈ మ్యాచ్‌లో జైశ్వాల్ మొత్తంగా నాలుగు క్యాచ్‌లు మిస్ చేశాడు. దీంతో ఓ టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే.. జైశ్వాల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చే అవకాశం ఉంది.