బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి నారా నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. గురించి మరోసారి ప్రస్తావించారు. బనకచర్ల వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని చంద్రబాబు అన్నారు. బనకచర్ల ప్రాజెక్టు ఏపీకి గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గోదావరి నుంచి ఏటా 3000 టీఎంసీల నీరు సముద్రంలో వృధాగా కలిసిపోతోందని చంద్రబాబు వివరించారు. వీటిలో 200 టీఎంసీల నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకుంటే రాయలసీమకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గోదావరి జలాల వినియోగంతో ఇటు ఏపీతో పాటుగా అటు తెలంగాణకూ ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు సూచించారు. మిగులు జలాలను రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చని సూచించారు. ఎంత వాడుకున్నా కూడా 200 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించుకునే అవకాశం లేదని చంద్రబాబు అన్నారు. గోదావరి జలాలను పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణానది బేసిన్‌లోకి.. అక్కడి నుంచి రాయలసీమలోని పెన్నాబేసిన్‌కు తరలించేందుకు గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. రూ. 80,000 కోట్ల వ్యయంతో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు రచించారు. అయితే, ప్రభుత్వంఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్, పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధమని చెబుతోంది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని తెలంగాణ ప్రభుత్వం వాదన.గోదావరి నదిలో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేశారు. అయితే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా తమకు కేటాయించిన నీరు దారి మళ్లించే అవకాశం ఉందని, భవిష్యత్తులో సాగు, తాగునీటి అవసరాలను ప్రభావితం చేసే అవకాశం ఉందంటోంది. బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల శాఖ, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్, ఏపెక్స్ కౌన్సిల్‌కు తెలియజేయకుండా, అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వాదన మరోలా ఉంది. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సముద్రంలోకి వృథాగా పోయే 200 టీఎంసీల గోదావరి వరద నీటిని ఉపయోగించుకుంటామని ఆయన చెప్తున్నారు. దీని వలన ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం ఉండదని చెప్తున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అయిన నేపథ్యంలో.. దాని లింక్ ప్రాజెక్టు అయిన గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టు చట్టబద్దమైనదేనని ఏపీ ప్రభుత్వం వాదన. సముద్రంలోకి వృథాగా పోయే నీటితో రాయలసీమ ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చవచ్చని ఏపీ ప్రభుత్వం చెప్తోంది.