ఏపీలో డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు, వివరాలివే

Wait 5 sec.

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.. రాష్ట్రంలోని పట్టణ ప్రజల కోసం డీజీ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. డీజీ లక్ష్మి ద్వారా ప్రజలకు 250 రకాల సేవలు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 9,034 కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్‌సీ-సాధారణ సేవా కేంద్రాలు) ఏర్పాటు చేస్తారు. (డ్వాక్రా మహిళలు) ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. ఈ మేరకు ఈ సీఎస్‌సీ సెంట్లర్ల నిర్వహణ కోసం ఎంపిక చేసేందుకు మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ-సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల సేవల్ని ప్రజలు పొందవచ్చు. ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటుగా మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని భావిస్తోంది ప్రభుత్వం.ఈ పథకానికి ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. 'లో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వివాహం అయి ఉండాలి.. సంబంధిత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివాసి అయి ఉండాలి. డిగ్రీ చదివి ఉండాలి.. స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేయడానికి రూ.2.50 లక్షల వరకు రుణం (కియోస్క్, ఇతర సదుపాయాల కల్పనకు) ఇస్తారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తుంది. మహిళలకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రభుత్వం రూ.23.84 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. వీరితో పాటుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది. స్వచ్ఛ భారత్‌ అర్బన్‌ 2.0 కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ ఉంటుంది. 123 మున్సిపల్, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో శిక్షణ ఇస్తారు. ఈ మేరకు ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏఐఐఎల్‌ఎస్‌జీ, సాహాస్, వాష్ సంస్థలను ఎంపిక చేస్తారు. స్వచ్ఛాంధ్ర సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కుప్పం నియోజకవర్గంలోని 51 చెరువులను బాగు చేస్తారు. దీని కోసం స్వర్ణకుప్పం-2029 మార్గసూచి కార్యక్రమంలో భాగంగా రూ.14.41 కోట్లు మంజూరు చేశారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటు రాజమహేంద్రవరం దగ్గర గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసింది. జాతీయ నదుల సంరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.