నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరికలు..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు వాతావరణం మారనుంది. బుధవారం, గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది వ్యవసాయ రంగానికి, సాధారణ ప్రజల దినచర్యకు గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. భయటకు పనులకు వెళ్లే వారు తెలిపారు. ముఖ్యంగా.. బుధవారం అంటే నేడు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు సాధారణంగా అధిక ఉష్ణోగ్రతలకు పేరుపొందాయి, కాబట్టి ఈ వర్షాలు వేడి నుంచి ఉపశమనం కలిగించగలవు. అయితే.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ బలమైన గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోవడం వంటి ప్రమాదాలు జరగవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అంతరాయం కలగవచ్చు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం కురవవచ్చని అంచనా వేస్తున్నారు. నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యలు వర్షాల నేపథ్యంలో ప్రజలు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షితమైన ఆశ్రయం తీసుకోవాలి. విద్యుత్ స్తంభాలు, పాత భవనాలకు దూరంగా ఉండటం మంచిది. బలమైన గాలుల సమయంలో వాహనాలను నెమ్మదిగా నడపాలి. రైతులు తమ పంటలకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, సాగు పనులను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో ఇలాంటి వాతావరణ మార్పులు సాధారణం. అయినప్పటికీ, వాతావరణ కేంద్రం ఇచ్చిన హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవడం ద్వారా అనవసర ప్రమాదాలను నివారించవచ్చు. స్థానిక అధికారులు కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నగరాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలను పర్యవేక్షించి, నీరు నిలబడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో తొందరగా ఎంటర్ అయినా.. మధ్యలో తిరోగమించాయి. ప్రస్తుతం మళ్లీ వర్షాలు జోరందుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.