పండించిన పంటకు మద్దతు ధర లభిస్తే.. అన్నదాతల కళ్లలో ఆనందం నిలుస్తుంది. వారు అన్ని రోజుల పడ్డ కష్టాన్ని మర్చిపోతారు. తాజాగా . చరిత్రలోనే తొలిసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జాతీయ మార్కెట్‌లో ఆంధ్రా కొబ్బరి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుంది. వెయ్యి కొబ్బరి కాయల ధర ఏకంగా 22 వేల రూపాయలు పలికింది. ఆవివరాలు.. ఈఏడాది ఆంధ్రా మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో అనగా.. తమిళనాడు, కర్ణాటక, కేరళలలో కొబ్బరి కాయల దిగుబడి భారీగి తగ్గిపోయింది. ఇది కాస్త ఆంధ్రా కొబ్బరి రైతులకు కలిసి వచ్చింది. పంట దిగుబడి సరిగా లేకపోవడం చేత... కొబ్బరి చరిత్రలో తొలిసారి అంబాజీపేట మార్కెట్‌లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22 వేలు పలికింది. లంక గ్రామాల్లో అయితే వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.23 వేల వరకూ పలుకుతోందని రైతులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కొబ్బరి సాగుతుంది. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 1.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా.. 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తున్నారు రైతులు. ఇక గత సంవత్సరం నుంచి రూ.10 వేలకు తగ్గడం లేదు. పచ్చికాయ, నిల్వ కాయ ధరలు ఇలానే స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక గతేడాది మే నెలలో ఒకానొక సందర్భంలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.12 వేల వరకూ పలికింది. ఇక ఈ ఏడాదిమే చివరి వారంలో రూ.16 వేలకు చేరింది. ఈ నెల అనగా జూన్ మొదటి వారంలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరిగింది. ఈ ధరలు ఇలానే పెరుగుతూ వస్తూ.. శనివారం నాడు ఏకంగా రూ.22 వేలు పలికింది. రానున్న వారం రోజుల్లో కొబ్బరి ధర మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడి భారీ స్థాయిలో పడిపోయింది. ఇక కేరళలో కొబ్బరి దిగుబడి మరింత పతనమైంయింది. దీంతో మార్కెట్‌లో కొబ్బరికి భారీ ఎత్తున్న డిమాండ్ ఉండటతో.. మంచి ధర పలుకుతుంది. పోయిన సంవత్సరం నుంచి రైతుల వద్ద కానీ, వ్యాపారుల వద్ద కానీ కొబ్బరి నిల్వ ఉండటం లేదు. వచ్చిన పంట వచ్చినట్లే అమ్ముడవుతుంది. ఇక ప్రస్తుతం కొబ్బరి ధరలు ఆశాజనకంగా ఉండటంతో వారం రోజుల వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ధరల పెరుగుదలకు ఇది కూడా ఓ కారణం అంటున్నారు. ఇక ఏపీ నుంచి హర్యానా, బిహార్, యూపీ, గుజరాత్‌, మహారాష్ట్రలకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది. పెరిగిన ధర కొబ్బరి రైతుల్లో సంతోషం నింపింది.