ఇది కదా కావాల్సింది.. లక్ష పెడితే రూ.72 లక్షలు.. ఇప్పుడు 1 షేరుకు 1 షేరు ఉచితం

Wait 5 sec.

Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరి, ఇన్ఫ్రా సెక్టార్ సంస్థ మేఘనా ఇన్ఫ్రాకాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Meghna Infracon Infrastructure Limited) తమ వాటాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచితంగా షేర్లు అందిస్తున్నట్లు తెలిపింది. కంపెనీకి చెందిన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఇటీవలే సమావేశమై బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం తెలుపినట్లు వెల్లిడించింది. ఈ రికార్డు తేదీని సైతం ప్రకటించిన క్రమంలో ఈ స్టాక్ ఫోకస్‌‍లోకి వచ్చింది. అంతే కాదు గత ఐదు సంవత్సర కాలంలో ఏకంగా 7200 శాతానికిపైగా లాభాన్ని తమ షేర్ హోల్డర్లకు అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలించింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. అంటే రికార్డు తేదీ నాటికి రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న కంపెనీ 1 ఈక్విటీ షేరు కొనుగోలు చేసి ఉంటే వారికి అదనంగా రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 ఈక్విటీ షేరును బోనస్ రూపంలో ఉచితంగా జారీ చేస్తారు. ఈ బోనస్ షేర్లు జారీకి సంబంధించి అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించేందుకు అవసరమైన రికార్డు తేదీని జులై 8, 2025గా బోర్డు నిర్ణయించింది.ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్లో మేఘనా ఇన్ఫ్రాకాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర 0.29 శాతం లాభంతో రూ. 1119.45 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 1164.90 వద్ద ఉండగా.. కనిష్ఠ ధర రూ. 380.05 వద్ద ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 4 శాతం పెరిగింది. గత నెల రోజుల్లో 7 శాతం, గత ఆరు నెలల్లో 54 శాతం లాభాన్ని ఇచ్చింది.ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేస్తే ఇప్పుడు ఆ విలువ రూ. 2.56 లక్షలకుపైగా ఉంటుంది. అలాగే గత ఐదేళ్ల కాలంలో ఈ షేరు ఏకంగా 7202 శాతం మేర లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. అంటే 5 ఏళ్ల క్రితం రూ. 1 లక్ష పెట్టి ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆ షేర్ల విలువ రూ. 72 లక్షలకుపైగా ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1220 కోట్లుగా ఉంది.